AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! Guntur: గుంటూరులో హై టెన్షన్... పోలీసులతో వైసీపీ నేతల తోపులాట! Statue Of Sacrifice: తుల్లూరు మార్గంలో సరికొత్త ఆకర్షణ...! పర్యాటక కేంద్రంగా మారనున్న స్మృతివనం! AI Summit: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు... ఏఐ సమ్మిట్‌లో ఏపీ టెక్ విజన్! Jagan: జగన్ 'బహిష్కరణ' మంత్రం.. ఎమ్మెల్యేల 'సంతకాల' తంత్రం: వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? Pemmasani: శరవేగంగా గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ పనులు.. మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్! Kesineni Sivanath: విజయవాడలో హైటెక్ యంత్రం ఎంట్రీ…! 15 నిమిషాల్లో గుంతలకు గుడ్‌బై! AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్! Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Legal Notice: కీలక వైసిపి నేతకు షాక్..! హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసులు! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! Guntur: గుంటూరులో హై టెన్షన్... పోలీసులతో వైసీపీ నేతల తోపులాట! Statue Of Sacrifice: తుల్లూరు మార్గంలో సరికొత్త ఆకర్షణ...! పర్యాటక కేంద్రంగా మారనున్న స్మృతివనం! AI Summit: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు... ఏఐ సమ్మిట్‌లో ఏపీ టెక్ విజన్! Jagan: జగన్ 'బహిష్కరణ' మంత్రం.. ఎమ్మెల్యేల 'సంతకాల' తంత్రం: వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? Pemmasani: శరవేగంగా గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ పనులు.. మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్! Kesineni Sivanath: విజయవాడలో హైటెక్ యంత్రం ఎంట్రీ…! 15 నిమిషాల్లో గుంతలకు గుడ్‌బై! AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్! Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Legal Notice: కీలక వైసిపి నేతకు షాక్..! హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసులు!

TTD Ghee Case: టీటీడీ నెయ్యి సరఫరాపై జగన్ ఆరోపణలకు మంత్రి కౌంటర్.. వైవీ సుబ్బారెడ్డి హయాంలోనే.!

Anitha Comments On Jagan: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) నెయ్యి సరఫరా అంశంలో వైసీపీ అధినేత జగన్ ఇవాళ మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Published : 2026-02-19 20:29:00
  • హెరిటేజ్‌కు, ఇందాపూర్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ..
     
  • వైవీ సుబ్బారెడ్డి హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందని తీవ్ర ఆరోపణలు..

Anitha Comments On Jagan: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) నెయ్యి సరఫరా అంశంలో వైసీపీ అధినేత జగన్ ఇవాళ మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు సమస్య అయిన కల్తీని పక్కనపెట్టి, సంబంధం లేని హెరిటేజ్ సంస్థపై జగన్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె, జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

హెరిటేజ్‌కు, ఇందాపూర్‌కు సంబంధమే లేదు… 
జగన్ ఆరోపిస్తున్నట్లుగా హెరిటేజ్‌కు, ఇందాపూర్ కంపెనీకి ఎలాంటి యాజమాన్య సంబంధం లేదని అనిత స్పష్టం చేశారు. ఇందాపూర్ అనేది బల్క్ మార్కెటింగ్ చేసే సంస్థ అని, అది చీజ్, పన్నీర్, టెట్రాప్యాక్ పాలు వంటి ఉత్పత్తులను తయారు చేసి హెరిటేజ్ వంటి కంపెనీలకు విక్రయిస్తుందని వివరించారు. హెరిటేజ్ సంస్థ నేరుగా వినియోగదారులకు మాత్రమే నెయ్యిని విక్రయిస్తుందని, ఎన్నడూ బల్క్‌గా ట్యాంకర్ల ద్వారా ఇతర కంపెనీలకు సరఫరా చేయలేదని తెలిపారు. "హెరిటేజ్ నుంచి ఇందాపూర్‌కు నెయ్యి వెళ్లి, అక్కడి నుంచి టీటీడీకి వస్తుందని చెప్పడానికి కనీసం బుర్ర పనిచేస్తుందా?" అని ఆమె ఎద్దేవా చేశారు. హెరిటేజ్ సంస్థ తన సిద్ధాంతాల ప్రకారం దేవాలయాలకు బల్క్‌గా సరఫరా చేయదని, ఈ విషయం చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడని అన్నారు.

ధరల పెరుగుదలపై చిన్న లాజిక్ మిస్సయ్యారు..
2015లో రూ.280 ఉన్న నెయ్యి ధర, 2026 నాటికి రూ.650కి ఎందుకు పెరిగిందని జగన్ ప్రశ్నించడాన్ని అనిత తప్పుబట్టారు. కాలంతో పాటు ధరలు పెరగడం సహజమని, ఈ చిన్న లాజిక్‌ను జగన్ ఎలా విస్మరించారని ఆమె ప్రశ్నించారు. "మీరు సాక్షి పేపర్ ప్రారంభించినప్పుడు దాని ధర రూ.2, ఇప్పుడు రూ.6.50. భారతీ సిమెంట్ బస్తా ధర రూ.250 నుంచి రూ.450కి పెరిగింది. 2015లో రూ.19 ఉన్న పాల ప్యాకెట్ ఇప్పుడు రూ.40కి చేరింది. పాల ధర పెరిగితే నెయ్యి ధర పెరగదా? బహుశా పాలు లేకుండానే నెయ్యి తయారుచేసే టెక్నాలజీ మీ తాడేపల్లి ప్యాలెస్‌లో ఉందేమో" అని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కర్ణాటకలో పాల ధరలు అధికంగా ఉండటం వల్లే నందిని డైరీ టీటీడీకి రూ.700కు నెయ్యి సరఫరా చేసిందని, ఆ విషయం గురించి జగన్ ఎందుకు మాట్లాడరని నిలదీశారు.

అసలు దొంగ మీ బాబాయే..
అసలు సమస్య అయిన నెయ్యి కల్తీ గురించి మాట్లాడకుండా, జగన్ సంబంధం లేని హెరిటేజ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని అనిత ఆరోపించారు. నెయ్యి కల్తీ జగన్ ప్రభుత్వ హయాంలో, ఆయన బాబాయి వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడే జరిగిందని అనిత తీవ్ర ఆరోపణలు చేశారు. "నెయ్యిలో రసాయనాలు కలిశాయని సిట్, ఎన్డీబీ రిపోర్టులు స్పష్టంగా తేల్చాయి. కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యాక కూడా అప్పటి మీ ప్రభుత్వం ఆ కంపెనీ టెండర్‌ను ఎందుకు రద్దు చేయలేదు? ఎందుకు ఆ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టలేదు?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కల్తీ జరిగిందని చార్జ్‌షీట్‌లో ఉన్నా, మీ బాబాయి స్వయంగా అంగీకరించినా దాని గురించి మాట్లాడకుండా, ముక్కు ఎక్కడ ఉందంటే చుట్టూ తిప్పి చూపినట్లు హెరిటేజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

టెండర్ నిబంధనలు మార్చిందెవరు?
కేవలం తమకు నచ్చిన కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే జగన్ ప్రభుత్వం టెండర్ నిబంధనలను నీరుగార్చిందని అనిత ఆరోపించారు. "ఒక చుక్క పాలు కూడా సేకరించని కంపెనీలు కూడా నెయ్యి సరఫరా చేసేలా నిబంధనలను మార్చారు. రూ.250 కోట్ల టర్నోవర్‌ను రూ.150 కోట్లకు తగ్గించారు. ఇవన్నీ ఎవరికోసం చేశారు? కల్తీపై చర్చకు మేము సిద్ధం. ఆధారాలు చూపించమన్నందుకే ప్రజలకు ఈ వాస్తవాలు వివరిస్తున్నాం. దమ్ముంటే కల్తీ గురించి మాట్లాడండి" అని జగన్‌కు ఆమె సవాల్ విసిరారు.

Spotlight

Read More →