Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Steel Plant: ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1.35 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్! మార్చి 23 న శంకుస్థాపన! Anna Canteens: ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు..! ఉగాది నుంచి పేదలకు పౌష్టికాహారం! RTC Depots: ఏపీలో వారికి శుభవార్త! కొత్తగా రెండు RTC డిపోలు...100 ఎలక్ట్రిక్ బస్సులు! SEZ: సెజ్ రైతుల సమస్యలపై మంత్రి కీలక ప్రకటన! టీటీడీ కొత్త ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతల స్వీకారం! AP Tourism: వట్టిచెరుకూరులో భారీ పెట్టుబడుల దిశగా అడుగులు...! కూటమి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్! AP Government: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! డిప్యూటీ కలెక్టర్‌గా టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని! Divwela Madhuri: తిరుమలలో దివ్వెల మాధురి హల్‌చల్.. పోలీసులకు టీటీడీ ఫిర్యాదు! Srikanth Case: శ్రీకాంత్ హత్యాయత్నం కేసులో ట్విస్ట్... దగదర్తిలో నోటీసుల కలకలం! Railway Station: ప్రయాణికులకు శుభవార్త! ఎయిర్పోర్ట్ లుక్కులో ఆ రైల్వే స్టేషన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Steel Plant: ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1.35 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్! మార్చి 23 న శంకుస్థాపన! Anna Canteens: ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు..! ఉగాది నుంచి పేదలకు పౌష్టికాహారం! RTC Depots: ఏపీలో వారికి శుభవార్త! కొత్తగా రెండు RTC డిపోలు...100 ఎలక్ట్రిక్ బస్సులు! SEZ: సెజ్ రైతుల సమస్యలపై మంత్రి కీలక ప్రకటన! టీటీడీ కొత్త ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతల స్వీకారం! AP Tourism: వట్టిచెరుకూరులో భారీ పెట్టుబడుల దిశగా అడుగులు...! కూటమి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్! AP Government: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! డిప్యూటీ కలెక్టర్‌గా టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని! Divwela Madhuri: తిరుమలలో దివ్వెల మాధురి హల్‌చల్.. పోలీసులకు టీటీడీ ఫిర్యాదు! Srikanth Case: శ్రీకాంత్ హత్యాయత్నం కేసులో ట్విస్ట్... దగదర్తిలో నోటీసుల కలకలం! Railway Station: ప్రయాణికులకు శుభవార్త! ఎయిర్పోర్ట్ లుక్కులో ఆ రైల్వే స్టేషన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే!

Nara Lokesh: 67 లక్షల మందికి రూ.8,454 కోట్ల మేర సాయం.. కూటమి ప్రభుత్వంలో 85శాతం మంది విద్యార్థులకు.!

Nara Lokesh Speech About Talliki Vandanam: తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించాం. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

Published : 2026-03-06 13:17:00
  • వైసీపీ హయాంలో 52శాతం మంది విద్యార్థులకే సాయం..
     
  • అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయం..

Nara Lokesh Speech About Talliki Vandanam: తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించాం. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం, యూడైస్ ప్రకారం రాష్ట్రంలో నమోదైన విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. యూడైస్ ప్రకారం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో 79,51,903 మంది విద్యార్థులు నమోదయ్యారు. తల్లికి వందనం పథకం కింద రూ.8,454 కోట్లు సాయం అందించాం. 67,01,653 మందికి తల్లికి వందనం వర్తించింది. యూడైస్ లో 86 లక్షల మంది విద్యార్థులు ఉన్నారంటూ వైసీపీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారు. యూడైస్ లో నమోదైన వారిలో అర్హులందరికీ(84.27%) సాయం అందించాం.  

వైసీపీ హయాంలో యూడైస్ కింద 81,72,224 మంది విద్యార్థులు నమోదై ఉంటే.. కేవలం 42,33,098 మందికి మాత్రమే, అంటే 52శాతం మందికి మాత్రమే ఇచ్చారు. మేం 85శాతం మందికి సాయం అందించాం. 2020-21 చూస్తే సుమారుగా 83 లక్షల మంది ఉంటే.. కేవలం 44 లక్షల మందికే ఇచ్చారు. 2021-22లో 82 లక్షల మంది ఉంటే.. కేవలం 43 లక్షల మందికే ఇచ్చారు. 2022-23లో 80 లక్షల మంది ఉంటే.. కేవలం 42 లక్షల మందికే ఇచ్చారు. వైసీపీ హయాంలో 52శాతం మంది విద్యార్థులకు ఇస్తే.. ప్రజా ప్రభుత్వంలో 84.27 శాతం మందికి అందజేశాం. తల్లికి వందనం పథకం కింద సాయం అందని వారి వివరాలు పంపిస్తే.. సరిచేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయం.

కొంతమందికి పాక్షిక సాయం అందించారనే విషయంలో.. సోషల్ వెల్ఫేర్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. మేం ముందు చెల్లించిన తర్వాత కేంద్రం నిధులు అందజేస్తోంది. రెండూ కలిసికట్టుగా మేం అందిస్తున్నాం. గ్యాప్ ఏమైనా ఉంటే వివరాలు ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం వర్తించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. 
 

Spotlight

Read More →