Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! AP Politics: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన! హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం కీలక భేటీ! AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! AP High Court: ఏపీలో కారుణ్య నియామకాల గుట్టురట్టు... పదేళ్లలో 20 వేల కొలువుల భర్తీ!! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ డీటైల్స్!! Praja Vedika: నేడు (22/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి మరో పథకం... వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం..!! Central Govt: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! మరో ఎనిమిది కొత్త రైళ్లు మంజూరు! AP Govt: ఖాళీ స్థలాల పన్ను సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ..! Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! AP Politics: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన! హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం కీలక భేటీ! AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! AP High Court: ఏపీలో కారుణ్య నియామకాల గుట్టురట్టు... పదేళ్లలో 20 వేల కొలువుల భర్తీ!! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ డీటైల్స్!! Praja Vedika: నేడు (22/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి మరో పథకం... వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం..!! Central Govt: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! మరో ఎనిమిది కొత్త రైళ్లు మంజూరు! AP Govt: ఖాళీ స్థలాల పన్ను సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ..!

SAPChairman: వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే బాగుండేది.. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు....!!

SAPChairman: రాష్ట్రంలో జరుగుతున్న క్రీడా పోటీలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై శాప్ (SAP) ఛైర్మన్ రవినాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రీడలు అనేవి పార్టీలకు అతీతంగా ఉండాలని, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే క్రీడాకారులకు మరింత ఉత్సాహం వచ్చేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Published : 2026-02-27 15:34:00

క్రీడాకారులను ఉత్సాహపరచడంలో వైసీపీ విఫలం…

పార్టీలకతీతంగా ఆడుదాం రండి…

రాజకీయాల కోసమే క్రీడలకు దూరం ఉంటున్నారా?

SAPChairman: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం నిర్వహించిన రెండో విడత ఆట విడుపు క్రీడలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, ఈ పోటీల విజయంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా శాప్ ఆధ్వర్యంలో ఈ క్రీడలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని, ఇది కేవలం ఆట మాత్రమే కాదని, రాష్ట్ర యువతకు ఒక గొప్ప సందేశాన్ని పంపే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు.

స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి ఆలోచన మేరకు రూపుదిద్దుకున్న ఈ పోటీలు, 2025 కన్నా ఈ ఏడాది మరింత ఉత్సాహంగా సాగడం విశేషమని కొనియాడారు.
మైదానంలోకి దిగిన ప్రజాప్రతినిధులు వృత్తిపరమైన క్రీడాకారులను తలపించారని రవి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కబడ్డీ వంటి శారీరక శ్రమతో కూడిన ఆటల్లో పలువురు ఎమ్మెల్యేలు గాయపడినప్పటికీ, వాటిని లెక్కచేయకుండా పట్టుదలతో ఆడటం వారి క్రీడా స్ఫూర్తికి అద్దం పడుతోందన్నారు. 70 ఏళ్ల వయసులో కూడా బుచ్చయ్య చౌదరి గారు పరుగు పందెంలో ఉత్సాహంగా పాల్గొనడం, కామినేని శ్రీనివాసరావు గారు కబడ్డీలో విజేతగా నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచాయని తెలిపారు. గెలుపోటముల కంటే, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం క్రీడలు ఎంత అవసరమో వీరంతా నిరూపించారని, ఇది నేటి తరం తల్లిదండ్రులకు, యువతకు ఒక గొప్ప స్ఫూర్తి అని ఆయన అభివర్ణించారు.

రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ పోటీల్లో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు పాల్గొనడాన్ని ఆయన స్వాగతించారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  వారి టీమ్ కూడా ఈ పోటీలకు వచ్చి ఉంటే ప్రజలకు మరింత సానుకూల సందేశం వెళ్లేదని అభిప్రాయపడ్డారు. కేవలం మాటలతో కాకుండా, మైదానంలోకి వచ్చి ఆడి చూపించడం ద్వారా కూటమి ప్రభుత్వ సభ్యులు క్రీడల పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని చెప్పారు. ఇదే ఉత్సాహంతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కూడా పోటీలు నిర్వహిస్తూ, గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నారని రవి నాయుడు వెల్లడించారు.

ఇక క్రికెట్ ఫైనల్ మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ.. అది భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే 'దాయాదుల పోరు'ను తలపించిందని చైర్మన్ చమత్కరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ టీమ్  అచ్చెన్నాయుడు టీమ్‌ల మధ్య జరిగిన పోరులో నాదెండ్ల టీమ్ వరుసగా రెండో ఏడాది కూడా విజేతగా నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మంత్రి సుభాష్, బొజ్జల సుధీర్ రెడ్డి, సుందరపు విజయ్ కుమార్ వంటి వారు ఆల్‌రౌండర్ ప్రతిభతో ఆకట్టుకున్నారని తెలిపారు. మొత్తం 13 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు త్వరలోనే బహుమతులు అందజేస్తామని ఆయన ప్రకటించారు.

రఘురామకృష్ణరాజు టీమ్ కబడ్డీ  టగ్ ఆఫ్ వార్‌లో అదరగొట్టగా, క్యారమ్స్‌లో మంత్రి సుభాష్, ఇతర క్రీడల్లో గద్దె రామ్మోహన్ విజేతలుగా నిలిచారని రవి నాయుడు వివరించారు. ఈ పోటీల కవరేజ్ ద్వారా క్రీడలను ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియా మిత్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్రీడలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమే శాప్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Spotlight

Read More →