Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే! House Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఇకపై 100% పన్ను కట్టక్కర్లేదు.. 50శాతం కడితే చాలు! Sakshi TV: సాక్షికి ఒకే రోజు మూడు భారీ ఎదురుదెబ్బలు.. ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల దావా! AP Government: గ్రామ పంచాయతీలకు శుభవార్త… కొత్త ఆదేశాలు జారీ!! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! Guntur: గుంటూరులో హై టెన్షన్... పోలీసులతో వైసీపీ నేతల తోపులాట! Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే! House Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఇకపై 100% పన్ను కట్టక్కర్లేదు.. 50శాతం కడితే చాలు! Sakshi TV: సాక్షికి ఒకే రోజు మూడు భారీ ఎదురుదెబ్బలు.. ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల దావా! AP Government: గ్రామ పంచాయతీలకు శుభవార్త… కొత్త ఆదేశాలు జారీ!! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! Guntur: గుంటూరులో హై టెన్షన్... పోలీసులతో వైసీపీ నేతల తోపులాట!

YCP MLCs: దేవుడితో రాజకీయం.. భక్తుల హృదయం గాయం! మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల వికృత చేష్టలు!

YCP MLCs Comments On TTD: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

Published : 2026-02-20 15:05:00
  • రాజకీయ లబ్ధి కోసం ఏ స్థాయికైనా..? కలియుగ దైవాన్ని సభలోకి లాగిన విపక్ష నేతలు..
     
  • సభా సమయం వృధా.. దేవుడి ఫొటోలతో గలాటా: వైసీపీ పక్కా వ్యూహంతోనే వచ్చిందా?

YCP MLCs Comments On TTD: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. రాజకీయ పోరాటాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే కానీ, కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడం, సభలో స్వామివారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. రాజకీయ లబ్ధి కోసం ఏ స్థాయికైనా దిగజారుతామని వైసీపీ నేతలు మరోసారి నిరూపించుకున్నారు. అత్యున్నతమైన శాసనమండలిలో ప్రజల సమస్యలపై చర్చించాల్సింది పోయి, దేవుడిని అడ్డం పెట్టుకుని హంగామా చేయడం భక్తులను విస్మయానికి గురిచేసింది.

దేవుడంటే ఏమాత్రం గౌరవం లేకుండా, అత్యంత హేయమైన రీతిలో వైసీపీ సభ్యులు సభలో వ్యవహరించారు. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామికే అపరాధం చేసేలా వారి చర్యలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఈ సంఘటనలో అత్యంత వివాదాస్పదమైన అంశం ఏమిటంటే.. వైసీపీ సభ్యులు అనుసరించిన నిరసన తీరు. సాధారణంగా మనం ఇంట్లో దేవుడి ఫొటోను తాకాలన్నా చెప్పులు విడిచి వెళ్తాం. కానీ, వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం కాళ్లకు చెప్పులు, షూలు వేసుకుని, చేతులతో స్వామివారి చిత్రపటాలను పట్టుకుని నినాదాలు చేస్తూ మండలిలోకి రావడం కోట్లాది మంది హిందువుల మనోభావాలను కించపరచడమే.

భక్తిని చాటుకోవాల్సిన చోట, షూలు వేసుకుని దేవుడి ఫొటోలతో గలాటా చేయడం వారి వికృత రాజకీయాలకు పరాకాష్ట అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలిలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా, సభ ఆర్డర్‌లో ఉండకుండా చేసేందుకు వైసీపీ ఒక పక్కా వ్యూహంతో వచ్చినట్లు కనిపిస్తోంది. "దేవుడితో ఆటలు వద్దు.. స్వామివారిని రాజకీయాల్లోకి లాగకండి" అని మంత్రులు పదేపదే సూచిస్తున్నా, వైసీపీ సభ్యులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఛైర్మన్ పోడియం దగ్గరకు వెళ్లి రభస చేయడం, మంత్రులు మాట్లాడుతున్నా వినకుండా అడ్డుపడటం ద్వారా సభా సమయాన్ని వృధా చేశారు.

వైసీపీ నేతల భక్తి ఎంతటిదో సభ వాయిదా పడిన తర్వాత స్పష్టమైంది. అప్పటిదాకా నిరసన పేరుతో హడావుడి చేసిన సభ్యులు, మండలి వాయిదా పడగానే తమ వెంట తెచ్చిన శ్రీవారి ఫొటోలను కనీస మర్యాద లేకుండా టేబుళ్లపై విసిరేసి వెళ్ళిపోయారు. ఈ దృశ్యం చూసిన భక్తులు, "మీకు దేవుడి మీద భక్తి ఉంటే అలా వదిలేస్తారా? ఇది కేవలం రాజకీయ నాటకం కాదా?" అని ప్రశ్నిస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు దేవుడిని వాడుకోవడం, పని పూర్తి కాగానే వదిలేయడం వైసీపీ వికృత ధోరణికి అద్దం పడుతోందని భక్తులు మండిపడుతున్నారు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ దైవత్వాన్ని అపహాస్యం చేయడం ఏమాత్రం క్షమించరాని నేరం. హిందూ సమాజాన్ని, వేంకటేశ్వర స్వామి భక్తులను ఘోరంగా అవమానించిన వైసీపీ నేతలకు భవిష్యత్తులో ప్రజలే గుణపాఠం చెబుతారని భక్తులు హెచ్చరిస్తున్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగే సంస్కృతి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు.

Spotlight

Read More →