ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం.. సామాన్యులకు ఊరట, కార్పొరేట్లకు షాక్! వారికి జైలు శిక్ష తగ్గింపు.. Modi Reaction: ప్రపంచంలో 3వ స్థానమే లక్ష్యం.. మోదీ మంత్రం.. నిర్మలమ్మ తంత్రం! ప్రధాని కీలక వ్యాఖ్యలు.. TTD Updates: టీటీడీలో భారీ మార్పు.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ.! కొత్త ఈవోగా ఆయన నియామకం.. Budget 2026-27: సామాన్యుడి జేబుపై ప్రభావం.. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? వారికి పండగే.. Union Budget 2026: చిన్న రైతులే దేశానికి వెన్నెముక.. పశువుల కాపరి నుండి పాడి రైతు వరకు ఆదాయం డబుల్! కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నారైలకు గోల్డెన్ ఛాన్స్! 10% నుండి 24%కి పెంపు - భారత మార్కెట్లోకి డాలర్ల వరద! ప్రపంచ స్థాయి రాజధాని దిశగా: దోహాలో క్రీడా ప్రాంగణాలు, లండన్‌లో టూరిజం ప్రాజెక్టుల పరిశీలన.. అమరావతికి కొత్త హంగులు! బడ్జెట్ బొనాంజా…. కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీ మ్యాప్‌నే మార్చబోతున్న మెగా ప్రాజెక్టులు! Union Budget: Union Budget: ఈసారి బడ్జెట్ ప్రసంగం ఒక విశేషం! విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక... చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 ! ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం.. సామాన్యులకు ఊరట, కార్పొరేట్లకు షాక్! వారికి జైలు శిక్ష తగ్గింపు.. Modi Reaction: ప్రపంచంలో 3వ స్థానమే లక్ష్యం.. మోదీ మంత్రం.. నిర్మలమ్మ తంత్రం! ప్రధాని కీలక వ్యాఖ్యలు.. TTD Updates: టీటీడీలో భారీ మార్పు.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ.! కొత్త ఈవోగా ఆయన నియామకం.. Budget 2026-27: సామాన్యుడి జేబుపై ప్రభావం.. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? వారికి పండగే.. Union Budget 2026: చిన్న రైతులే దేశానికి వెన్నెముక.. పశువుల కాపరి నుండి పాడి రైతు వరకు ఆదాయం డబుల్! కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నారైలకు గోల్డెన్ ఛాన్స్! 10% నుండి 24%కి పెంపు - భారత మార్కెట్లోకి డాలర్ల వరద! ప్రపంచ స్థాయి రాజధాని దిశగా: దోహాలో క్రీడా ప్రాంగణాలు, లండన్‌లో టూరిజం ప్రాజెక్టుల పరిశీలన.. అమరావతికి కొత్త హంగులు! బడ్జెట్ బొనాంజా…. కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీ మ్యాప్‌నే మార్చబోతున్న మెగా ప్రాజెక్టులు! Union Budget: Union Budget: ఈసారి బడ్జెట్ ప్రసంగం ఒక విశేషం! విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక... చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 !

PM Modi: మోదీ అమెరికా పర్యటన రద్దు! ట్రంప్ ముఖం కూడా చూడాలనుకోవట్లేదు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అధిక టారిఫ్‌లతో ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తుతున్నాయి. ప్రత్యేకంగా రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తున్న ట్రంప్, ఆ ద

Published : 2025-09-06 09:24:00
TTD: భక్తులకు అలర్ట్‌..! తిరుమలలో సేవలు రద్దు..! టీటీడీ కీలక ప్రకటన!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అధిక టారిఫ్‌లతో ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తుతున్నాయి. ప్రత్యేకంగా రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తున్న ట్రంప్, ఆ దేశంతో వ్యాపార సంబంధాలు పెట్టుకునే దేశాలపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలను ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌పై కూడా ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్‌లను విధించారు. మొదట 25 శాతం మాత్రమే పెంచుతారని అనుకున్నా, తరువాత మరో 25 శాతం పెంచడంతో మొత్తం 50 శాతం భారాన్ని భారత్ భరించాల్సి వచ్చింది.

Health centers: గ్రామీణ ఆరోగ్యానికి బలమైన పునాది..! రూ.217 కోట్లతో రాష్ట్రంలో కొత్త విలేజ్ హెల్త్ క్లినిక్‌లు!

ఈ టారిఫ్ నిర్ణయం భారత్‌కు ఆర్థికంగా పెద్ద సవాలుగా మారింది. అమెరికా వైపు నుంచి వచ్చిన ఈ ఒత్తిడి నేపథ్యంలో భారత్, చైనా, రష్యాలతో సంబంధాలను మరింత బలపరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాను సందర్శించి, అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్‌తో సమావేశం కావడం అంతర్జాతీయ వర్గాల్లో విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామం భారత్-అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

USA: అమెరికా చరిత్రలో తొలిసారి జనాభా క్షీణత..! నిపుణుల అంచనాలతో ఆందోళనలో వైట్‌హౌస్‌!

ఇంతలోనే ప్రధాని మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలలో జరగబోయే ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశాలకు తాను హాజరు కాకుండా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌ను పంపాలని నిర్ణయించారు. భారత్ తరఫున జైశంకర్ ప్రాతినిధ్యం వహించి సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి హాజరవ్వడానికి ఆయన 27వ తేదీన న్యూయార్క్‌కు బయలుదేరే అవకాశం ఉంది. మోదీ గైర్హాజరు కావడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది.

Railway Safety: రైల్వే శాఖ కీలక నిర్ణయం! మొత్తం 1,782 కోచ్లలో.. ఇక ఆ సమస్యలకు చెక్!

ప్రధాని మోదీ చివరిసారిగా 2021లో ఐరాస సర్వసభ సమావేశాలకు హాజరయ్యారు. అయితే, గత ఏడాది ఆయన న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినా, అది సాధారణ సమావేశం కోసం మాత్రమే. అంతకుముందు 2022లో "సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్"లో పాల్గొని ప్రసంగించారు. 2022 నుండి జైశంకరే యునైటెడ్ నేషన్స్ సమావేశాల్లో భారత్ తరఫున హాజరవుతున్నారు. మోదీ తన 11 ఏళ్ల పదవీకాలంలో నాలుగు సార్లు (2014, 2019, 2020, 2021లో) యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. మిగతా సార్లు సుష్మా స్వరాజ్, జైశంకర్ ప్రాతినిధ్యం వహించారు.

Gold Silver: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే!

ఈ పరిణామాల మధ్య భారత్-అమెరికా సంబంధాలు ఏ దిశగా పయనిస్తాయో చూడాలి. ఒకవైపు ట్రంప్ టారిఫ్‌లతో ఒత్తిడి పెంచుతుండగా, మరోవైపు భారత్ ఇతర శక్తివంతమైన దేశాలతో స్నేహాన్ని బలపరుస్తోంది. అంతేకాకుండా, ఈ ఏడాది చివర్లో జరగనున్న క్వాడ్ సమ్మిట్ కోసం ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే, రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Shobhita Dhulipala: శోభిత దూళిపాళ్ల మెసేజ్ చూశారా! పెళ్లయిన సంవత్సరంలోనే ఇది అన్నమాట సంగతి!
Free Bikes: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! ఉచితంగా బైకులు... దరఖాస్తు వివరాలు!
Sarvepalli Radhakrishnans : ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు.. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం!
Forest Department: ఏనుగుల దాడులకు చెక్..! ఆధునిక టెక్నాలజీతో అటవీ శాఖ సరికొత్త వ్యూహం!
Praja Vedika: నేడు (6/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →