Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

Telangana Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ అదిరిపోయే అప్‌డేట్.. రెండో విడత ఎప్పటినుంచో తెలుసా?

Telangana Housing Scheme: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ చివరి వారం లేదా మే నుంచి కొత్త ఇళ్ల కేటాయింపులు ప్రారంభం కానున్నాయి. పాత గృహలక్ష్మి పథకం నిధులతో పాటు పట్టణాల్లో ఇళ్ల నిర్మాణంపై పూర్తి వివరాలు..

Published : 2026-03-25 18:15:00

Telangana Housing Scheme: తెలంగాణలో సొంతింటి కల ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ.. రెండో విడత కేటాయింపులపై అసెంబ్లీ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందే సాయం, పంపిణీ గడువు మరియు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది.

మంత్రి పొంగులేటి తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ చివరి వారం లేదా మే నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున కేటాయించగా, ప్రస్తుతానికి లక్షా 12 వేల ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. జూన్ నాటికి మరో లక్ష ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు కూడా ఈ ప్రకటనతో పెద్ద ఊరట లభించింది. సగం నిర్మించి ఆగిపోయిన ఇళ్లకు కూడా ప్రస్తుత ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇంటి నిర్మాణ దశను బట్టి ఆర్థిక సాయం అందుతుందని, దీనివల్ల సొంతంగా ఇల్లు కట్టుకుంటూ నిధుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మందికి మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

ఇక పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్తీలకు సమీపంలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. గతంలో ఊరికి దూరంగా ఇళ్లు ఇవ్వడం వల్ల లబ్ధిదారులు అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపలేదని గుర్తించిన సర్కార్, ఇప్పుడు ఆ తప్పు జరగకుండా చూస్తోంది. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే 14 నుంచి 15 మురికివాడలను గుర్తించి, అక్కడి ప్రజల సౌకర్యార్థం దగ్గరలోనే ఇళ్లు నిర్మించబోతున్నారు.

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్  మహబూబ్ నగర్ వంటి పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని  చేపట్టనున్నారు. పారదర్శకంగా, ఎక్కడా అవినీతికి తావులేకుండా అర్హులైన పేదలందరికీ గూడు కల్పించడమే తమ ఉద్దేశమని రేవంత్ ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి నిబంధనలు  దరఖాస్తు ప్రక్రియపై స్పష్టత రానుంది.

Spotlight

Read More →