Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

టీడీపీలో కార్యాలయంలో నారా లోకేష్ ప్రసంగం! పార్లమెంటరీ కమిటీల్లో 83% వారికే ఛాన్స్!

యువగళం పాదయాత్ర మూడు సంవత్సరాల సందర్భంగా టిడిపి కార్యాలయంలో జరిగిన వేడుకలలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు.

Published : 2026-01-27 13:48:00

టీడీపీలో కార్యకర్తలే బాస్… నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు…

యువతకు పెద్దపీట…

మాట తప్పడం మా రక్తంలోనే లేదు…

టీడీపీలో కార్యకర్తలే అసలైన బాధ్యులని, వారే పార్టీకి బలమని లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన అంజిరెడ్డి, మంజుల, తోట చంద్రయ్య వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, అంకితభావం ఉన్నవారికే కమిటీల్లో చోటు కల్పించామని, ముఖ్యంగా 83 శాతం మంది కొత్తవారికి అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని లోకేష్ వివరించారు. ప్రజలకు సేవ చేయడం, కార్యకర్తలకు అండగా ఉండటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఇచ్చిన మాటపై నిలబడటం తెలుగుదేశం పార్టీ డీఎన్ఏలోనే ఉందని, మాట తప్పడం అనే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు.

సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పదవుల పంపిణీలో సామాజిక న్యాయం పాటించినట్లు తెలిపారు. జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ముఖ్యంగా మహిళలకు 33 శాతం పదవులు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే కూటమి ప్రభుత్వ అంతిమ ధ్యేయమని స్పష్టం చేశారు.

పార్టీలో యువత ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ, గ్రామ స్థాయి అధ్యక్షుడు కూడా పొలిట్ బ్యూరో స్థాయికి ఎదిగేలా సంస్కరణలు తెచ్చామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు అవసరమని, అందుకే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు యువతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. యువతరం ఉత్సాహంతో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

రైతు సంక్షేమంపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అన్నదాతకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతులకు కష్టం వస్తే నాయకులందరూ ముందుండి పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని లోకేష్ తన ప్రసంగంలో గుర్తుచేశారు.

Spotlight

Read More →