- కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు..
- చిత్తూరు, అనకాపల్లి కూటమి నేతలకు ఆత్మీయ విందు..
TDP Leaders Dinner Meeting with Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త, ఆరోగ్యకరమైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే. కూటమిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో వ్యక్తిగత బంధాన్ని బలోపేతం చేసే దిశగా పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ఆత్మీయ విందు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో సమావేశం అయిన లోకేశ్... ఇవాళ రాత్రి ఉండవల్లిలోని తన నివాస ప్రాంగణంలో చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని కూటమి ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబ సభ్యులకు ఆత్మీయ విందు ఇచ్చారు.
నారా లోకేశ్ ప్రారంభించిన ఈ 'ఆత్మీయ కలయిక' ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త ఒరవడి. ఇది కేవలం విందు కాదు, ఒక బలమైన రాజకీయ కుటుంబానికి పునాది. ఇలాంటి ఆరోగ్యకరమైన సంప్రదాయాలు ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరం.