TamilNadu Elections 2026: విజయ్ సంచలన నిర్ణయం... సీఎం పదవి ఆఫర్‌ను కాదన్న టీవీకే! North Korea: ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అఖండ విజయం..! ఏకంగా 99.93 శాతం ఓట్లతో రికార్డు! Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! AP Politics: ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం...! నేటి నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి అధికారం! Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్! Praja Vedika: నేడు (18/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక నుండి అది తప్పనిసరి... ఆదేశాలు జారీ! AP Secretariat: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… కొత్త నిబంధనలు! TamilNadu Elections 2026: విజయ్ సంచలన నిర్ణయం... సీఎం పదవి ఆఫర్‌ను కాదన్న టీవీకే! North Korea: ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అఖండ విజయం..! ఏకంగా 99.93 శాతం ఓట్లతో రికార్డు! Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! AP Politics: ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం...! నేటి నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి అధికారం! Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్! Praja Vedika: నేడు (18/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక నుండి అది తప్పనిసరి... ఆదేశాలు జారీ! AP Secretariat: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… కొత్త నిబంధనలు!

అజిత్ పవార్‌కు వీడ్కోలు.. బారామతిలో నివాళి అర్పించిన నారా లోకేశ్!

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కన్నుమూత – అంత్యక్రియలకు హాజరైన ఏపీ మంత్రుల బృందం – కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ నివాళి – మూడు రోజుల పాటు మహారాష్ట్రలో సంతాప దినాలు.

Published : 2026-01-29 15:17:00
  • రాష్ట్ర అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు..
  • అంత్యక్రియలకు హాజరైన అనగాని, కృష్ణదేవరాయలు, మాగుంట..

మహారాష్ట్ర రాజకీయాల్లో 'దాదా'గా పిలవబడే సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) అకాల మరణం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. బుధవారం (జనవరి 28) ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గురువారం బారామతిలో జరిగిన ఆయన అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ హాజరై నివాళులర్పించారు.

మహారాష్ట్రతో ఉన్న సుదీర్ఘ రాజకీయ సంబంధాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం తరపున ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం బారామతికి వెళ్ళింది. మంత్రి నారా లోకేశ్, అజిత్ పవార్ భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పవార్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప సందేశాన్ని అందజేశారు.

లోకేశ్‌తో పాటు రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు అజిత్ పవార్‌కు తుది వీడ్కోలు పలికారు. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో అజిత్ పవార్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అజిత్ పవార్ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే మరియు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆత్మీయ నేతకు వీడ్కోలు పలికారు. తమ ప్రియతమ నేతను ఆఖరిసారి చూసేందుకు బారామతి వీధుల్లో వేలాది మంది ప్రజలు బారులు తీరారు.

అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, అభివృద్ధికి చిహ్నంగా నిలిచిన ఆయన 'దదా'గా చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం కోరుకుందాం.

Spotlight

Read More →