- హాస్టళ్ల అభివృద్ధి కోసం రూ. 300 కోట్లు.. కూటమి ప్రభుత్వం కొత్త రూపు!
- ఎస్సీ కంపోనెంట్ – అట్టడుగు వర్గాలకు అగ్రపీఠం…
Nara Lokesh Gift: వసతి గృహాల్లో ఉండే పిల్లలు తమ ఇంట్లో ఉన్నంత హాయిగా, రక్షణగా భావించినప్పుడే చదువుపై దృష్టి పెట్టగలరు. అందుకే, రాష్ట్రంలోని 743 సంక్షేమ హాస్టళ్లను, రెసిడెన్షియల్ పాఠశాలలను కూటమి ప్రభుత్వం కొత్త రూపు సంతరించుకునేలా చేస్తోంది.
పిల్లల ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మి ప్రతి చోటా శుద్ధి చేసిన తాగునీటి సౌకర్యం, టీవీలు, రియల్ టైమ్ పర్యవేక్షణ ద్వారా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెస్తోంది. హాస్టళ్ల అభివృద్ధి కోసం రూ. 300 కోట్లు కేటాయించి, పిల్లలకు ఒక సురక్షితమైన నీడను అందిస్తోంది ప్రభుత్వం.
ప్రతి పేదవాడికి సొంతింటి కల అనేది ఒక భావోద్వేగం. ఆ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం PMAY పథకం కింద ఇళ్లను మంజూరు చేయడమే కాకుండా, ఎస్సీ వర్గాలకు అదనంగా రూ. 50,000 ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇది ఆయా కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుంది.
ఎస్సీ కంపోనెంట్ – అట్టడుగు వర్గాలకు అగ్రపీఠం
సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ఏకంగా రూ. 20,644 కోట్లను ఎస్సీ కంపోనెంట్ కోసం ప్రతిపాదించింది. చదువుకోవాలన్న తపన ఉన్న విద్యార్థికి పేదరికం అడ్డుకాకూడదని ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోంది.
గతంలో ఎస్సీల నిధులను అందరికీ ఇచ్చే పథకాల ఖాతాలో వ్రాసి, అవే వారికి జరిగిన మేలని పద్దులు రాసి, పత్రికల్లో ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసేవారు. "నా ఎస్సీలు" అని దీర్ఘాలు తీయడమే తప్ప, నాడూ నేడులో కూడా ఏరోజూ వాస్తవ రూపంలో సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోలేదు జగన్. వారి సబ్ ప్లాన్ నిధులను అందరికీ ఇచ్చే పథకాలకు వాడటం వల్ల, ఎస్సీలకు దక్కాల్సిన ప్రత్యేక ప్రయోజనం దక్కకుండా పోయింది.
నేడు ఎస్సీల పిల్లలకు పెద్ద దిక్కులా, అమ్మలా.. గూడు కోసం కలలు కనే వారి కుటుంబాలకు అదనపు సాయం చేస్తూ అండగా కూటమి నిలవడం గొప్ప విషయం.