Land Registration: రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు! సాఫ్ట్‌వేర్ ద్వారానే భూ సమస్యల పరిష్కారం! US-Iran nuclear: అమెరికా ఇరాన్ న్యూక్లియర్ చర్చలు... 26న జెనీవాలో! AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు! Housing Scheme: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇళ్ల కేటాయింపు ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే! Sunil Kumar: సునీల్ కుమార్ అప్పటివరకు సస్పెన్షన్ లోనే...ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (23/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Land Registration: రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు! సాఫ్ట్‌వేర్ ద్వారానే భూ సమస్యల పరిష్కారం! US-Iran nuclear: అమెరికా ఇరాన్ న్యూక్లియర్ చర్చలు... 26న జెనీవాలో! AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు! Housing Scheme: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇళ్ల కేటాయింపు ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే! Sunil Kumar: సునీల్ కుమార్ అప్పటివరకు సస్పెన్షన్ లోనే...ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (23/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Nara Lokesh: ఉద్యోగార్థులకు తీపి కబురు.. ఉగాది నాటికి 'మెగా జాబ్ క్యాలెండర్' - అసెంబ్లీలో మంత్రి లోకేశ్ వెల్లడి.!

Nara Lokesh GoodNews For Job Seekers: రాష్ట్రంలోని కేజీబీవీల్లో అడ్మిషన్లు దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఉన్నాయని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ... గత రెండేళ్లలో ఫలితాలు బాగా మెరుగుపర్చాం, రాష్ట్రంలో కేజీబీవిలో చేరడానికి విద్యార్థినులు పోటీ పడుతున్నారు.

Published : 2026-02-23 14:26:00
  •  జీతాల పెంపుపై కేంద్రంతో చర్చలు: కేజీబీవీ సిబ్బందికి బాధ్యత నాది - లోకేశ్ భరోసా..
     
  • కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పీఆర్సీ: 11 వేల మంది కేజీబీవీ సిబ్బందికి శుభవార్త..

Nara Lokesh GoodNews For Job Seekers: రాష్ట్రంలోని కేజీబీవీల్లో అడ్మిషన్లు దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఉన్నాయని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ... గత రెండేళ్లలో ఫలితాలు బాగా మెరుగుపర్చాం, రాష్ట్రంలో కేజీబీవిలో చేరడానికి విద్యార్థినులు పోటీ పడుతున్నారు. కేజీబీవి ప్రోగ్రామ్ సెంట్రలైజ్డ్ స్పాన్సర్డ్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తే, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. జీతాలు పెంచాలన్నా, ఏ ఇతర నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర, రాష్ట్రాలు కలిసి చేయాల్సివుంది. 

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ ను పెంచాల్సివుంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నాం. దానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా స్పందించారు. ఎన్ టీఎస్ ను పెద్దలందరూ కోరారు. దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాల్సి ఉంది. దాదాపు 11 వేల మంది ఈ వ్యవస్థలో పనిచేయడం జరుగుతోంది. ఇది 11 వేల మందికి సంబంధించిన విషయం. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న తరువాతే జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై హైకోర్టులో పిటిషన్ ఉంది, దానిపై రివ్యూ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం పీఏబీ అప్రూవ్ చేసిన తరువాత జీతాలు పెంపుపై మేం బాధ్యత తీసుకుంటాం. 

ఇప్పటికే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతాలు చెల్లించడం జరుగుతోంది. అయినా నేను ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసినప్పుడు మాకు బడ్జెట్ పెంచమని కోరడం జరిగింది. మేం తప్పనిసరిగా ఫాలోఅప్ చేస్తాం. డీఎస్సీ గురించి కూడా సభ్యులు ప్రస్తావించారు. గత సంవత్సరంలో 16 వేల మంది ఉపాధ్యాయులను నియమించాం. ఈ ఏడాది ఉగాది నాటికి మెగా జాబ్ కేలండర్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.  వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ చేయాల్సివుంది. మళ్లీ జోనల్ రీ నోటిఫికేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. రీయూనిఫికేషన్ చేయాల్సిన అవసరముంది.  అన్ని డిపార్టుమెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఉగాది నాటికి మళ్లీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయ పోస్టులు కూడా ఉంటాయని మంత్రి లోకేష్ చెప్పారు.

Spotlight

Read More →