Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

International Relations: యూరప్ తన గొయ్యి తనే తవ్వుకుంటోంది.. ట్రంప్ బృందం ఘాటు వ్యాఖ్యలు.

భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై అమెరికా తీవ్రంగా స్పందించింది..

Published : 2026-01-27 08:35:00
కువైట్‌తో దశాబ్దాల స్నేహానికి గుర్తుగా UAE లో భారీ ఉత్సవాలు!

ప్రపంచ  రాజకీయాల్లో పెను మార్పులకు వేదికగా మారుతున్న తరుణంలో, భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం  ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2007 నుండి సుమారు రెండు దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ చర్చల అనంతరం, మంగళవారం నాడు ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్  అధికారికంగా ప్రకటించనుండటం పట్ల ట్రంప్ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గ్రామం ఒకప్పుడు ఒక ప్రత్యేక దేశమని మీకు తెలుసా?

అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐరోపా దేశాల తీరును ఎండగట్టారు. యూరప్ తనకు తానుగా ఒక యుద్ధానికి నిధులు సమకూర్చుకుంటోంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాస్కోను ఆర్థికంగా దెబ్బతీయాలని వాషింగ్టన్ ప్రయత్నిస్తుంటే, యూరప్ మాత్రం పరోక్ష మార్గాల ద్వారా రష్యా ఇంధన రంగానికి ప్రాణం పోస్తోందని ఆయన ఆరోపించారు.

బెస్సెంట్ విశ్లేషణలోని ముఖ్యాంశాలు

పరోక్ష ఇంధన వ్యాపారం: భారత్ రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేస్తోంది. దానిని భారత్‌లోని రిఫైనరీలలో శుద్ధి చేసిన తర్వాత, అదే చమురు ఉత్పత్తులను యూరప్ దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా ఊతమివ్వడమేనని అమెరికా వాదన.

త్యాగాల్లో అసమానత: రష్యాపై పోరులో అమెరికా భారీ త్యాగాలు చేస్తోందని, కానీ యూరప్ మాత్రం తన ఆర్థిక ప్రయోజనాల కోసం నిబంధనల్లోని లొసుగులను వాడుకుంటోందని బెస్సెంట్ మండిపడ్డారు.

భారత్‌పై టారిఫ్ల ఒత్తిడి: రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా భారత్‌పై అమెరికా ఇప్పటికే 25 శాతం నుండి 50 శాతం వరకు సుంకాలను విధించింది. అయితే, అమెరికా హెచ్చరికలను లెక్కచేయకుండా యూరప్ భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం ట్రంప్ యంత్రాంగానికి మింగుడుపడటం లేదని చెప్పుకోవాలి.

భారత్-ఈయూ బంధం

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఈ ఒప్పందాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా అభివర్ణించారు. అమెరికా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలు, సుంకాల యుద్ధం  నేపథ్యంలో భారత్ మరియు యూరప్ పరస్పరం సహకరించుకోవడం ప్రపంచ వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉండనుంది.

ఈ ఒప్పందం ద్వారా రక్షణ రంగం, సాంకేతికత, మరియు కార్మికుల రాకపోకలు  వంటి కీలక రంగాల్లో భారత్‌కు భారీ లబ్ధి చేకూరనుంది. అమెరికా విధిస్తున్న అడ్డంకులను అధిగమించడానికి భారత్ ఈ ఒప్పందాన్ని ఒక కవచంలా భావిస్తుంటే, ఐరోపా తన ఇంధన మరియు తయారీ అవసరాల కోసం భారత్‌ను ఒక నమ్మకమైన భాగస్వామిగా చూస్తోంది. ట్రంప్ ప్రభుత్వం రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరలోనే ముగిస్తామని వాగ్దానం చేస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం మిత్రదేశాల మధ్యే వాణిజ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. 

ఒకవైపు అమెరికా అమెరికా ఫస్ట్ విధానంతో ముందుకు వెళ్తుంటే మరోవైపు భారత్ మరియు యూరప్ తమ సొంత ప్రయోజనాల కోసం కొత్త కూటములను నిర్మించుకుంటున్నాయి. మంగళవారం జరగబోయే ఈ అధికారిక ప్రకటన కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా నిలవనుంది

Spotlight

Read More →