AP Another VandeBharat: ఏపీకి మరో వందేభారత్ - ఆ రూట్ లోనే.! కేంద్రమంత్రితో భేటీ.. వరాల జల్లు! Praja Vedika: రేపు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Mana Mitra : రైతన్నలకు గుడ్ న్యూస్ వాట్సాప్‌లో Hi కొడితే చాలు.. మీ ముంగిటకే సాగు సేవలు! Chandrababu: వారికి సోషల్ మీడియా నిషేధం! సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! Sivaratri Arrangements AP: శ్రీశైల బ్రహ్మోత్సవాలకు చంద్రబాబు దిశానిర్దేశం.. ఢిల్లీ నుంచే సమీక్ష.. భక్తులకు రాజమర్యాదలు! Chief Minister: కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి... ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా వరుస భేటీలు! Undavalli Comments on Tirumala Laddu: ఉండవల్లి వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం.. సిట్ రిపోర్టును అడ్డం పెట్టుకుని కొత్త డ్రామా! BJP leader Suicide: ఉద్రిక్తత.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు.. ఇకపై పత్రాల అవసరం లేదు.. ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు! క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు! ఢిల్లీలో చంద్రబాబు మార్క్ పాలిటిక్స్.. ఐదుగురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ! AP Another VandeBharat: ఏపీకి మరో వందేభారత్ - ఆ రూట్ లోనే.! కేంద్రమంత్రితో భేటీ.. వరాల జల్లు! Praja Vedika: రేపు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Mana Mitra : రైతన్నలకు గుడ్ న్యూస్ వాట్సాప్‌లో Hi కొడితే చాలు.. మీ ముంగిటకే సాగు సేవలు! Chandrababu: వారికి సోషల్ మీడియా నిషేధం! సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! Sivaratri Arrangements AP: శ్రీశైల బ్రహ్మోత్సవాలకు చంద్రబాబు దిశానిర్దేశం.. ఢిల్లీ నుంచే సమీక్ష.. భక్తులకు రాజమర్యాదలు! Chief Minister: కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి... ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా వరుస భేటీలు! Undavalli Comments on Tirumala Laddu: ఉండవల్లి వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం.. సిట్ రిపోర్టును అడ్డం పెట్టుకుని కొత్త డ్రామా! BJP leader Suicide: ఉద్రిక్తత.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు.. ఇకపై పత్రాల అవసరం లేదు.. ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు! క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు! ఢిల్లీలో చంద్రబాబు మార్క్ పాలిటిక్స్.. ఐదుగురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ!

CM Chandrababu Delhi Tour Updates: స్వచ్ఛాంధ్రకు కేంద్రం గ్రీన్ సిగ్నల్... సీఎం చంద్రబాబు విన్నపానికి కేంద్ర మంత్రి సానుకూల స్పందన!

CM Chandrababu Delhi Tour Updates: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిశారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన రూ.105 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు

Published : 2026-02-10 19:28:00

CM Chandrababu Delhi Tour Updates:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా  కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సోమవారం సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల రీసైక్లింగ్ కోసం ప్రభుత్వం చేపట్టిన వినూత్న ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం కావాలని ఆయన కోరారు.

ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మిషన్-2.0 (SBM-U 2.0) కింద ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ  జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే పలు పారిశుద్ధ్య ప్రాజెక్టులు వేగంగా  కొనసాగుతున్నాయి వీటికి సంబంధించి కేంద్ర వాటా కింద రావాల్సిన రూ.105 కోట్లను  మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లలో పారిశుద్ధ్య వ్యవస్థ కుంటుపడిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత  'స్వచ్ఛాంధ్ర' కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నామని సీఎం మంత్రికి వివరించారు. గ్రామాల్లో మరియు పట్టణాల్లో చెత్త సేకరణ, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఈ నిధులు ఎంతో అవసరమని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్   ఈ అంశాలపై సానుకూలంగా స్పందించారు. పట్టణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న చొరవను అభినందించిన ఆయన, స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధనలో కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని హామీ ఇచ్చారు. రూ.105 కోట్ల నిధుల విడుదలకు సంబంధించి అధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ఖట్టర్ పేర్కొన్నారు. పట్టణాల్లో పారిశుద్ధ్య ప్రమాణాలను పెంపొందించడం ద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచవచ్చని, ఆ దిశగా చంద్రబాబు చేస్తున్న కృషికి కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసాను పారదర్శకంగా, జవాబుదారీతనంతో వినియోగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ 2.0 నిధులతో రాష్ట్రంలోని నగరాలు మున్సిపాలిటీలను గార్బేజ్ ఫ్రీ సిటీస్'గా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ప్రజల్లో అవగాహన పెంచుతూ ఆధునిక యంత్రాల సాయంతో చెత్త నిర్మూలన చేపట్టేందుకు రూపొందించిన ప్రణాళికలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఢిల్లీ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న నిధులపై సీఎం జరుపుతున్న ఈ వరుస భేటీలు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Spotlight

Read More →