Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

పార్టీ సిద్ధాంతం ముఖ్యం.. అలసత్వం వహిస్తే వేటే.. నాయకులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్!

ప్రతి మూడు నెలలకోసారి పనితీరు సమీక్ష – నిర్లక్ష్యం వహిస్తే పదవుల నుంచి తొలగింపు – మిత్రపక్షాలతో సమన్వయమే లక్ష్యం – 2024 కంటే పది ఓట్లు అదనంగా రావాల్సిందే – మంగళగిరి వర్క్‌షాప్‌లో అధినేత కీలక ఆదేశాలు.

Published : 2026-01-27 20:42:00
Chandrababu Naidu: ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ వర్క్‌షాప్ హైలైట్! కార్యకర్తలా కూర్చున్న సీఎం చంద్రబాబు..!
  • పదవులు పొందిన నేతల పనితీరుపై ప్రతి 3 నెలలకోసారి సమీక్ష
  • అధికారాన్ని నిలబెట్టుకోవడం అందరి బాధ్యత అని నేతలకు సూచన
AP News: ఏపీలో 20 ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.. 10 జిల్లాల్లో ప్రాధాన్యత క్రమంలో..

పదవి వచ్చింది కదా అని విశ్రాంతి తీసుకుంటామంటే కుదరదని, ప్రజా సేవలో అంకితభావంతో లేని వారిని నిర్దాక్షిణ్యంగా పక్కనబెడతామని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం జరిగిన పార్లమెంట్ కమిటీల వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగిస్తూ, రాబోయే రోజుల్లో పార్టీ మరియు ప్రభుత్వ పాలనలో అనుసరించాల్సిన కఠిన నిబంధనలను వివరించారు.

President’s At Home: రాష్ట్రపతి విందులో సమంత..! సినిమాలకే కాదు… దేశానికే గర్వకారణం!

నాయకులలో జవాబుదారీతనం పెంచేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు మరియు చేసిన వ్యాఖ్యల పూర్తి పాఠం ఇక్కడ ఉంది. పార్టీలో పదవులు అనుభవించడానికి కాదు, బాధ్యతగా పని చేయడానికి అని చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకుల పనితీరును అంచనా వేసేందుకు ఆయన ఒక కొత్త విధానాన్ని ప్రకటించారు.

"మీరు ఏ పదవిలో ఉన్నా సరే, ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ పనితీరును నేను వ్యక్తిగతంగా సమీక్షిస్తాను. గ్రాఫ్ పడిపోయినా, ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా వెంటనే ఆ పదవి నుంచి తప్పించి మరొకరికి అవకాశం ఇస్తాను" అని ఆయన తేల్చి చెప్పారు. మార్పుకు అనుగుణంగా మారలేని వారు రాజకీయాల్లో వెనుకబడిపోతారని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు.

2024 ఎన్నికల విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, ఆ విజయాన్ని నిలబెట్టుకోవాలంటే మరింత కష్టపడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జనసేన మరియు బీజేపీ నాయకులతో కలిసికట్టుగా పనిచేయాలని, ఎక్కడా వివాదాలకు తావివ్వకూడదని ఆదేశించారు. పొత్తు ధర్మాన్ని గౌరవించని వారిపై చర్యలు తప్పవన్నారు. "గత ఎన్నికల్లో మనకు వచ్చిన ఓట్ల కంటే వచ్చేసారి ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం 10 ఓట్లు అదనంగా వచ్చేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి" అని ఆయన దిశానిర్దేశం చేశారు.

పార్లమెంట్ కమిటీలే పార్టీకి వెన్నెముక అని, ఎంపీలు మరియు మంత్రులు సైతం ఈ కమిటీల అధ్యక్షులతో ఎప్పటికప్పుడు చర్చలు జరపాలని సూచించారు. చంద్రబాబు తన ప్రసంగంలో కార్యకర్తలకు, నాయకులకు కొన్ని కీలక సూత్రాలను వివరించారు.

అలసత్వం వద్దు: అధికారం శాశ్వతం కాదు, ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవడం ముఖ్యం.
వివాదాలకు దూరం: సొంత పార్టీలో గానీ, కూటమి పార్టీలతో గానీ వివాదాలు సృష్టిస్తే సహించేది లేదు.
టెక్నాలజీ వాడకం: 2026ను 'టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్'గా ప్రకటించినందున, నేతలు కూడా డిజిటల్ పద్ధతుల్లో ప్రజలకు చేరువ కావాలి.

కార్యకర్తే అధినేత.. వారికి అండగా ఉండాలి
పార్టీలో కార్యకర్తే అధినేత అని, వారికి న్యాయం జరిగినప్పుడే పార్టీ శాశ్వతంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారని, పసుపు జెండా కోసం రక్తం చిందించారని గుర్తుచేశారు. "ఏ పని జరిగినా కార్యకర్తలకు గుర్తింపు ఉండాలి. నాయకులెవరూ కేడర్‌ను విస్మరించవద్దు. వారితో నిరంతరం అనుసంధానమై ఉండాలి" అని ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. "మనం చేసే పనులు ఎంత ముఖ్యమో, మనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం కూడా అంతే ముఖ్యం. సోషల్ మీడియాలోనే కాదు, మౌత్ టు మౌత్ పబ్లిసిటీతో ప్రజలకు వాస్తవాలు వివరించాలి," అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సూపర్ 6 హామీలను సూపర్ హిట్‌ చేశామని, డీఎస్సీ, పోలీస్ ఉద్యోగాల భర్తీతో పాటు రోడ్ల మరమ్మతులు వేగవంతం చేశామని వివరించారు. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ కూటమి గెలిచేలా ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని కోరారు.

గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వివాదాస్పద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేసి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. "ప్రజల భూముల పట్టాదారు పాసుపుస్తకాలపై, పొలం సరిహద్దు రాళ్లపై కూడా వాళ్ల ఫొటోలు ముద్రించుకున్నారు. చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ప్రజల ఆస్తుల జుట్టు వాళ్ల చేతుల్లో పెట్టుకుని ఆడించాలని చూశారు. అందుకే ఆ లోపభూయిష్టమైన చట్టాన్ని రద్దు చేశాం. ఏడాదిలోగా మళ్లీ సర్వేలు చేసి, ఎలాంటి సమస్యలు లేని పట్టాదారు పుస్తకాలు అందిస్తాం" అని హామీ ఇచ్చారు.

అమరావతి విషయంలో గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిందని, ఇప్పుడు మళ్లీ తాము రాజధానికి జీవం పోశామని అన్నారు. అమరావతే ఏకైక రాజధాని అని స్పష్టం చేస్తూనే, అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ధ్యేయమని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు. భోగాపురం విమానాశ్రయంలో 500 ఎకరాలు కొట్టేయాలని చూశారని, పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేశారని ఎద్దేవా చేశారు.
 

Spotlight

Read More →