Nara Lokesh: విశాఖలో నారా లోకేష్ సందడి... విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికిన శ్రేణులు! APSRTC: అమరావతిలో 165 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్స్..! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! AP Assembly: ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు! పిల్లల సంక్షేమం అందరికీ ఇస్తాం! Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక ఎయిర్‌పోర్ట్ రేంజ్..! స్కై వాక్ ద్వారా నిమిషాల్లో ప్రయాణం! Nara Lokesh: విశాఖలో నారా లోకేష్ సందడి... విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికిన శ్రేణులు! APSRTC: అమరావతిలో 165 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్స్..! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! AP Assembly: ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు! పిల్లల సంక్షేమం అందరికీ ఇస్తాం! Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక ఎయిర్‌పోర్ట్ రేంజ్..! స్కై వాక్ ద్వారా నిమిషాల్లో ప్రయాణం!

Sivaratri Arrangements AP: శ్రీశైల బ్రహ్మోత్సవాలకు చంద్రబాబు దిశానిర్దేశం.. ఢిల్లీ నుంచే సమీక్ష.. భక్తులకు రాజమర్యాదలు!

Sivaratri Arrangements AP: శివభక్తుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే సహించేది లేదు – మంత్రులు ఆనం, అనితలకు కీలక బాధ్యతలు – తిరుమల తరహాలో శ్రీశైల అభివృద్ధి – పటిష్టమైన భద్రత, వసతులపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు.

Published : 2026-02-10 16:10:00
  • ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్: భక్తుల రక్షణే ప్రథమ కర్తవ్యం..
  • మంత్రులు, అధికారులకు కీలక బాధ్యతలు…

Sivaratri Arrangements AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికీ, భక్తుల సౌకర్యాల విషయంలో రాజీపడకూడదనే ఉద్దేశంతో అక్కడి నుంచే మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీశైలంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన శివాలయాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎక్కడా లోటుపాట్లు కూడా తలెత్తకూడదని సీఎం కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.

శ్రీశైల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని గుర్తించిన సీఎం చంద్రబాబు.. క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా వారికి అవసరమైన వసతి సౌకర్యాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శివరాత్రి నాటికి రద్దీ ఇంకా పెరుగుతుంది.. ఇప్పటి నుంచే పటిష్టమైన కార్యచరణ ఉండాలి అని సీఎం స్పష్టం చేశారు. అధికారులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని భక్తుల రక్షణే ప్రథమ కర్తవ్యంగా ఉండాలని సూచించారు.

మంత్రులు అధికారులకు దిశానిర్దేశం
ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోం మంత్రి వంగలపూడి అనితలకు ముఖ్యమంత్రి కీలక బాధ్యతలు అప్పగించారు. దేవస్థానాల్లో ఏర్పాట్లు, భక్తుల వసతులను మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్‌ కు సూచిస్తూ.. అన్ని ప్రభుత్వ విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. డీజీపీతో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, క్యూలైన్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.

స్వామివారి భక్తులకు గౌరవం ఇవ్వాల్సిందే..
ఎంతో నిష్ఠతో మాలధారణ చేసి పాదయాత్రల ద్వారా మైళ్ల దూరం నుంచి వచ్చే శివభక్తుల పట్ల అధికారులు, సిబ్బంది ఎంతో మర్యాదగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భక్తులను అగౌరవపరిచేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదు.. వారు ఎంతో కష్టపడి స్వామి దర్శనం కోసం వస్తారు, వారికి మనోధైర్యాన్ని ఇస్తూ సేవలు అందించాలి అని చంద్రబాబు సున్నితంగా హెచ్చరించారు. ఆలయాల్లో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని, భవిష్యత్తులో కూడా తిరుమల తరహాలో శ్రీశైలాన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Spotlight

Read More →