AP Budget 2026 Date: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ షెడ్యూల్ ఖరారు.. మార్చి 7 వరకు సమావేశాలు 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..!! Bharath Bandh: దేశవ్యాప్తంగా భారత్ బంద్... ఎందుకు? ఏమిటి? Amaravati: అమరావతే శాశ్వత రాజధాని.. మూడు రాజధానుల ప్రతిపాదనపై గవర్నర్ విమర్శలు! AP Assembly: అసెంబ్లీలో గవర్నర్ సంచలన ప్రసంగం... గత ఐదేళ్లలో ఏపీ విధ్వంసం! రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయం.. GHMC: జీహెచ్‌ఎంసీ మూడు ముక్కలు.. కొత్త కార్పొరేషన్లు ఇవే! వారికి కీలక బాధ్యతలు! CPI: అవినీతి సూచీలో భారత్‌కు స్వల్ప ఊరట..! సీపీఐ నివేదికలో ఆసక్తికర వివరాలు! Supreme Court: ఏపీ డిప్యూటీ సీఎం ఫోటోలపై వివాదానికి తెర.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు! Chandrababu: ఢిల్లీలో చంద్రబాబు రైల్వే ప్లాన్: ఏపీలో నాలుగు మెగా కోచింగ్ టెర్మినల్స్! Praja Vedika: నేడు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: రంజాన్ మాసం కానుక... ఉద్యోగులకు తీపి కబురు! కీలక ఉత్తర్వులు జారీ! AP Budget 2026 Date: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ షెడ్యూల్ ఖరారు.. మార్చి 7 వరకు సమావేశాలు 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..!! Bharath Bandh: దేశవ్యాప్తంగా భారత్ బంద్... ఎందుకు? ఏమిటి? Amaravati: అమరావతే శాశ్వత రాజధాని.. మూడు రాజధానుల ప్రతిపాదనపై గవర్నర్ విమర్శలు! AP Assembly: అసెంబ్లీలో గవర్నర్ సంచలన ప్రసంగం... గత ఐదేళ్లలో ఏపీ విధ్వంసం! రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయం.. GHMC: జీహెచ్‌ఎంసీ మూడు ముక్కలు.. కొత్త కార్పొరేషన్లు ఇవే! వారికి కీలక బాధ్యతలు! CPI: అవినీతి సూచీలో భారత్‌కు స్వల్ప ఊరట..! సీపీఐ నివేదికలో ఆసక్తికర వివరాలు! Supreme Court: ఏపీ డిప్యూటీ సీఎం ఫోటోలపై వివాదానికి తెర.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు! Chandrababu: ఢిల్లీలో చంద్రబాబు రైల్వే ప్లాన్: ఏపీలో నాలుగు మెగా కోచింగ్ టెర్మినల్స్! Praja Vedika: నేడు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: రంజాన్ మాసం కానుక... ఉద్యోగులకు తీపి కబురు! కీలక ఉత్తర్వులు జారీ!

Amaravati Funds Released 2026: ఏపీ రాజధానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. నిధుల విడుదలతో వేగవంతం కానున్న అమరావతి పనులు!

Amaravati Funds Released 2026: అమరావతికి కేంద్రం నుంచి రూ. 750 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభలో వెల్లడించిన పూర్తి వివరాలు...

Published : 2026-02-11 11:50:00

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి తన మద్దతును చాటుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న తరుణంలోనే, కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేస్తూ అమరావతికి నిధుల విడుదలను ధృవీకరించింది. కేంద్రం గతంలో ప్రకటించిన రూ. 1500 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయంలో భాగంగా, ఈ ఏడాది జనవరి చివరి నాటికి ఇప్పటికే రూ. 750 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ మంత్రి ఈ వివరాలను బహిర్గతం చేశారు.

అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ల నుంచి వస్తున్న రుణ సాయంపై కూడా కేంద్రం స్పష్టతనిచ్చింది. ఈ రెండు అంతర్జాతీయ సంస్థల ద్వారా మొత్తం రూ. 15,000 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని సమకూర్చడంలో కేంద్రం మధ్యవర్తిగా ఉండి సహకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రూ. 5,120 కోట్లు విడుదల చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మొత్తం రుణంలో 90 శాతం నిధులు బ్యాంకులే సమకూరుస్తుండగా మిగిలిన 10 శాతం నిధులను ప్రత్యేక గ్రాంట్ల రూపంలో కేంద్రమే భరించనుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై వడ్డీ భారం తగ్గడమే కాకుండా రాజధాని పనులు అడ్డంకులు లేకుండా సాగడానికి అవకాశం కలుగుతుంది.

రాజధాని పనుల పర్యవేక్షణ విషయంలో కేంద్రం పూర్తి బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించింది. కేంద్రం నుంచి అందుతున్న గ్రాంట్లు, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి పొందుతున్న రుణాలకు సంబంధించిన ఖర్చుల వివరాలను ఏపీ ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తోందని మంత్రి పేర్కొన్నారు. గత బడ్జెట్ (2024-25) లో అమరావతి కోసం కేంద్రం ఇచ్చిన హామీ మేరకు నిధుల ప్రవాహం మొదలవ్వడంతో, పెండింగ్‌లో ఉన్న సచివాలయం, అసెంబ్లీ మరియు ఇతర పరిపాలనా భవనాల పనులు త్వరలోనే ఊపందుకోనున్నాయి. ఈ పరిణామం అమరావతి రైతులకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద ఊరటనిస్తోంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి సంబంధించి నానో ఎరువుల సరఫరాపై కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ కీలక వివరాలు వెల్లడించారు. టీడీపీ ఎంపీ సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, రాష్ట్రానికి కేటాయించిన నానో ఎరువులలో ఇప్పటివరకు 42.36 శాతం మాత్రమే సరఫరా చేసినట్లు ఆమె ఒప్పుకున్నారు. గత మూడేళ్లలో ఏపీకి 34.68 లక్షల బాటిళ్ల నానో యూరియాతో పాటు 21.76 లక్షల బాటిళ్ల నానో డీఏపీని పంపిణీ చేసినట్లు తెలిపారు. మొత్తం 56.44 లక్షల బాటిళ్ల కేటాయింపులు ఉండగా, అందులో 23.91 లక్షల బాటిళ్లు ఇప్పటికే రైతులకు చేరువయ్యాయని వివరించారు.

రాజధాని నిధులతో పాటు ఎరువుల సరఫరా వంటి అంశాలపై పార్లమెంట్ వేదికగా కేంద్రం ప్రకటనలు చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఒకవైపు అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తూనే, మరోవైపు రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాను క్రమబద్ధీకరించడంపై కేంద్రం దృష్టి సారించింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ సానుకూల సంకేతాలు రావడం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఆశిస్తున్న సహాయ సహకారాలు సకాలంలో అందుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన గ్రాంట్లు కూడా విడుదలవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Spotlight

Read More →