పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావుకు 2024 విజనరీ లీడర్ అవార్డు లభించింది. బ్రిటిష్ పార్లమెంట్ లండన్ వేదికగా ఈ అవార్డు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్ ఇంగ్లాండ్ ప్రకటించింది. ప్రజల కోసం ప్రగతి కోసం అనే నినాదంతో ప్రతినిత్యం ప్రజా శ్రేయస్సు కాంక్షించే ఎమ్మెల్యే ఏలూరికి అరుదైన గౌరవం దక్కింది.ప్రజల అర్షద్వానాల మధ్య ప్రజా నేత సాంబన్నకు లండన్ పార్లమెంట్ వేదికగా అక్కడ అతిరథ మహారాజుల సమక్షంలో అంతర్జాతీయ పురస్కారం ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే పలుమార్లు పలు అవార్డులు అందుకున్నారు. నిరంతరం ప్రజల కోసం ప్రజల వెంట ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నందుకు ఈ పురస్కారాన్ని అందజేసినట్లు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్ ఇంగ్లాండ్ పేర్కొంది. దార్శనిక నేతగా, ముందు చూపు కలిగి సమాజం పట్ల అంకితభావం జనంతోనే ఉంటూ నూతన ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తూ,ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్యే నిలుస్తున్నారని పేర్కొంది. ప్రజల కోసం అందరికంటే భిన్నంగా వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతూ నూతన సామాజిక ఆవిష్కరణలకు ఏలూరి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. యువతకు పెద్దపీట వేస్తూ... రాజకీయంగా, ఆర్థికంగా, భవిష్యత్తు కు బంగారు బాటలు వేసేలా యువ మేధావులను నూతన ఆలోచనల వైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తున్నారు. సమాజాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ ప్రజా సంక్షేమంతో పాటు నిస్వార్ధ సేవలు అందిస్తున్నారు.
ఇంకా చదవండి: నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
అతిరథ మహారధుల సమక్షంలో అవార్డు...
యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ వేదికగా ఎమ్మెల్యే ఏలూరికి విజనరీ లీడర్ అవార్డు ప్రకటించారు. అతిరథ మహారధుల సమక్షంలో జరిగిన ఈ అవార్డుల వేడుక కన్నుల పండుగగా జరిగింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్ ఇంగ్లాండ్ ప్రతినిధులు దివాకర్ సుకుల్, మిస్టర్ జాన్ రైన్ఫోర్డ్,
లండన్ పార్లమెంట్ సభ్యులు వీరేంద్ర శర్మ, నవేందు మిశ్రా లు అవార్డును ఎమ్మెల్యే ఏలూరికి ప్రకటించారు.
గతంలోనూ జాతీయ పురస్కారం...
2020లో ఎమ్మెల్యే ఏలూరికి దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డు ను అందుకున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డుకు దక్షిణ భారతదేశం నుంచి ఎమ్మెల్యే ఏలూరి అతిరథ మహారథుల చేతుల మీదుగా అందుకున్నారు. మీట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ, భారత స్టూడెంట్ పార్లమెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పురస్కార ఢిల్లీ లోని రాజపథ్ మౌలానా ఆజాద్ రోడ్డులోని విజ్ఞాన్ భవన్ లో అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరికి ఈ అరుదైన అవకాశం లభించింది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించడం, మౌలిక వసతులు కల్పనకు కృషి చేయడం విద్య వైద్యానికి పెద్దపీట వేయడం వంటి అనేక అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని అవార్డును అందజేశారు.
ఆనందోత్సహాలు...
ఎమ్మెల్యే ఏలూరికి అంతర్జాతీయ పురస్కారం లభించడం పట్ల పలువురు మంత్రులు రాజకీయ నేతలు నియోజకవర్గ ప్రజలు హార్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సాంబన్నకు అవార్డు ప్రకటనతో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఆనందోత్సహాలు వెల్లివిరుస్తున్నాయి.
ఇంకా చదవండి: 6 వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు? ఎవరెవరికి అంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: