వైఎస్ఆర్ జిల్లా పులివెందుల వైకాపా నేతల అధీనంలో ఉన్న సంగారెడ్డికి చెందిన సతీశ్ కుమార్ కార్లను ఎట్టకేలకు పోలీసులు విడిపించారు. పులివెందుల వైద్య కళాశాల కోసమని చెప్పి సతీశ్కుమార్కు చెందిన ఆరు కార్లను పులివెందుల వైకాపా నేతలు అద్దె ఒప్పందంపై తీసుకెళ్లారు. ఒక్కో కారుకు రోజుకు రూ.1500 చొప్పున అద్దె చెల్లిస్తామని నమ్మించి కార్లను తీసుకున్నారు. గత మూడేళ్లుగా కార్లను వైకాపా నేతలు వినియోగిస్తున్నారు. జీపీఎస్ ట్రాక్ చేసి చూడగా.. కార్లు వేంపల్లెలో ఉన్నట్లు గుర్తించిన సతీశ్.. వాటిని తిరిగి ఇచ్చేయాలని అడిగారు. అలా అడిగినందుకు తనను ఇడుపులపాయలో బంధించి కొట్టారని 2021లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు కార్లను ఇప్పించలేకపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎట్టకేలకు ఈ కేసులో కదలిక వచ్చింది. కడప పోలీసుల సాయంతో నాలుగు రోజులుగా పులివెందలు, వేంపల్లెలో తిరిగిన తెలంగాణ పోలీసులు.. ఆరు కార్లను స్వాధీనం చేసుకొని బాధితుడు సతీశ్కు అప్పగించారు. సతీశ్.. తెలంగాణ పోలీసులతో కలిసి కడప నుంచి ఆరు కార్లతో సంగారెడ్డికి బయలుదేరారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!
షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్లడం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!
ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: