విశాఖపట్నం: కనుమ వేళ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 400 మంది వైకాపా కార్యకర్తలకు ఒకొక్కరికి ఫుల్ బాటిల్ మద్యంతో పాటు రెండు కిలోలు తూగే ఓ కోడిని పంపిణీ చేశారు.
దీనికి విద్యాసంస్థను వేదికగా చేసుకోవడం స్థానికంగా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. నగరంలోని ఆశీలుమెట్టలో రామబాణం పేరుతో జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే వాసుపల్లి నిర్వహిస్తున్నారు. కళాశాలలోని ఓ గదిని ఆయన కార్యాలయంగా కూడా ఉపయోగిస్తున్నారు. మంగళవారం వందల కోళ్లు, 400 వరకు మద్యం బాటిళ్లను కళాశాలకు తీసుకొచ్చారు. ఓ తరగతి గదిలో కార్యకర్తలను కూర్చోబెట్టి ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలపై చర్చించిన అనంతరం మద్యం, కోడి పంపిణీ చేసినట్లు చెబుతున్నారు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
ఈ దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద మూడు పుల్ బాటిల్స్ మించి ఉండకూడదు. అయితే ఎమ్మెల్యే వాసుపల్లి ఏకంగా 400 ఫుల్ బాటిళ్లు నిల్వ ఉంచారు. కార్యకర్తలకు మద్యం, కోళ్లు పంపిణీ చేయడానికి కళాశాలను ఎంపిక చేసుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే వాహనం కళాశాల వద్ద కనిపించింది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి