ఉద్రిక్తంగా మారిన విజయవాడ ధర్నా చౌక్... బస్టాండ్లు , రైల్వేస్టేషన్లు అదుపులోకి తీసుకున్న పోలీసులు...
నేడు అంగన్వాడీల 'చలో విజయవాడ' కార్యక్రమం...
సీఐటీయూ నాయకురాలు సుధారాణిని గృహనిర్బంధం
ఎన్ని ఇబ్బందులు పెట్టినా విజయవంతం చేసి తీరతాం అంటున్న అంగనవాడీలు...
ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఉద్రిక్తంగా మరీనా ధర్నా చౌక్...
వైకాపా ప్రభుత్వంపై అంగన్వాడీలు పోరాట తీవ్రతను పెంచారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో సీఎం జగన్ మొండివైఖరిని నిరసిస్తూ సోమవారం 'చలో విజయవాడ' కార్యక్రమాన్ని తలపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను జగన్కు ఇచ్చేందుకు తరలిరావాలని ఇప్పటికే అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని రెండు విడతల్లో చేపట్టనున్నట్లు తెలిసింది. మొద విజయనగరం, ప్రకాశం, బాపట్ల, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, అన్నమయ్య, తిరుపతి, నంద్యాల జిల్లాల కార్యకర్తలు, ఆయాలు సోమవారం విజయవాడకు చేరుకునేలా ప్రణాళిక రచించారు. మిగతా జిల్లాల వారు మంగళవారం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం తనిఖీలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన కార్యకర్తలు, ఆయాలను పలుచోట్ల బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో సీఐటీయూ నాయకురాలు సుధారాణిని గృహనిర్బంధం చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ పలువురిని అడ్డుకున్నారు.
శ్రీకాకుళం నుంచి వెళ్తున్న వారిని ఫకీరుపేటలో అడ్డుకుని, మందిని పోలీస్ స్టేషన్కు తరలించి బైండోవర్ కేసులు నమోదు చేశారు. సొంత పూచీకత్తుపై విడిచిపెట్టినట్లు ఎస్సై గోవిందరావు తెలిపారు. ఉరవకొండ మండలంలో దీక్షాశిబిరాన్ని శనివారం రాత్రి పోలీసులు తొలగించారు. అప్పటికే వందలమంది విజయవాడ ధర్నాచౌక్కు చేరుకున్నారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు రోడ్డును పోలీసులు పూర్తిగా మూసివేసి, తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి