ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శించారు. గురువారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్.. 11:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి స్వాగతం పలికారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అనంతరం బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి జగన్ వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత నెలలో కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడడంతో ఎడమ తుంటికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి