జగన్మోహన్ రెడ్డి తన మొండి వైఖరితో పేదల ఆరోగ్యంతో చలగాటమాడుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు రాష్ట్రవ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయటంపై లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి సమస్యను సామరస్యంగా పరిష్కరించి పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నారా లోకేష్ ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
జగన్మోహన్ రెడ్డి యొక్క అస్వస్థ పాలనతో రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కు దాదాపు 1200 కోట్లు పైన బకాయి పడటంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయకులను బలి పశువులుగా మార్చొద్దు. లక్షలాది పేదల ప్రాణాలతో ముడిపడిన ఆరోగ్య సేవలు విషయంలో మొండి వైఖరి విడనాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించే చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి