తిరుపతి: తల్లి ఆరోగ్యం బాగోలేదని అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఎన్ఆర్ఐ టీడీపీ సానుభూతిపరుడు యశశ్వి(యశ్)ని ఏపీ సీఐడీ నేడు తిరుపతికి పిలిపించింది. డిసెంబర్ 23న విమానం దిగగానే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో యశస్విని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ తర్వాత యశ్ను గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
కోర్టులో హజరు పరచగా న్యాయమూర్తి రిమాండును తిరస్కరించి 41 ఏ నోటిస్ ఇవ్వాలని ఆదేశించారు. యశ్ పాస్పోర్టును సైతం అతనికి తిరిగి ఇచ్చి వేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేడు యశ్ను విచారణ నిమిత్తం తిరుపతి సీఐడీ కార్యాలయానికి అధికారులు పిలిపించారు. యశ్ కోసం పెద్ద ఎత్తున సీఐడీ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. ఆయనకు 41ఏ నోటీసు ఇచ్చి సీఐడీ పంపించేసింది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి