ఓవైపు తాను వదిలిన బాణం తిరిగి తనవైపే దూసుకురావడం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మతిభ్రమించిన సీఎం జగన్ విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.
పిచ్చివాడి చేతిలో రాయి అటు, ఇటు తిరిగి న్యాయమైన డిమాండ్ల కోసం 42 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీల వైపు మళ్లిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం నియంతృత్వ పోకడలకు అద్దం పడుతోందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తాటాకు చప్పుళ్లకు లొంగని అంగన్వాడీలు 'చలో విజయవాడ'కు పిలుపునివ్వడంతో తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు చెలరేగుతున్నాయని లోకేశ్ అన్నారు. వారికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తోందన్నారు.
ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం మూర్ఖపు చర్యలను విడనాడి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. జగన్ ప్రభుత్వం తొలగించే అంగన్వాడీలను తెదేపా - జనసేన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి సర్వీసు అంతరాయం లేకుండా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి