విజయవాడ: ఎంపీ కేశినేని నాని ఎన్ని అంటున్నా 1999 నుంచి తానే సర్దుకుపోతూ వచ్చానని ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని)అన్నారు. కుటుంబంలో కలహాలు అప్పటి నుంచి ఉన్నాయని.. వాటితో తెదేపాకు, అధినేత చంద్రబాబు కు సంబంధమేంటని ప్రశ్నించారు. బుధవారం సీఎం జగన్ను కలిసిన అనంతరం కేశినేని నాని విమర్శలు చేసిన నేపథ్యంలో చిన్ని స్పందించారు.
“మా కుటుంబంలో దశాబ్దాలుగా సమస్యలు ఉన్నాయి. ఎంపీ టికెట్ ఇచ్చి రెండుసార్లు ఆదరించిన నందమూరి, నారా కుటుంబాలను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదు. అమరావతిని సర్వనాశనం చేసిన జగన్ చెంతకు ఆయన చేరడాన్ని విజయవాడ ప్రజలు హర్షించరు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షను మరచి మాట్లాడటం తగదు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
స్టిక్కర్ గురించి నా భార్యపై మీరు దొంగ కేసు పెట్టారు. కుటుంబం, పార్టీ విషయాలు కలపకూడదని ఏరోజూ నేను వాటి గురించి మాట్లాడలేదు.
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ వెంట లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు నడిచారు. విజయవాడకు హెచ్సీఎల్ సహా ఎన్నో సంస్థలు వచ్చాయంటే దానికి ఆయనే కారణం. ఎంతోమంది మహామహులు వీడినా టీడీపీ కు ఏమీ కాలేదు. వచ్చేవాళ్లు వస్తుంటారు.. పోయేవాళ్లు పోతుంటారు అని కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి