వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనం కోసం కాంగ్రెస్ పార్టీలో పని చేస్తానని వైఎస్ షర్మిల తెలిపారు. గురువారం ఉదయం తన భర్త అనిల్ తో కలిసి ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో ఆమె కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఖర్గే ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. తనకు ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పని చేస్తానని ఈ సందర్భంగా షర్మిల స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉంది. దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్. అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత హస్తం పార్టీది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉంది. వైఎస్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారు. నేను వైఎస్ అడుగుజాడల్లో నడుస్తాను.అని షర్మిల పేర్కొన్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ ఓ భాగమని, కార్యకర్తలు, నేతలు, అభిమానులు కాంగ్రెస్ పార్టీ లక్ష్యాల మేరకు పని చేస్తారని చెప్పారు. 'వైఎస్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడి పని చేశారు. మా నాన్న అడుగుజాడల్లోనే నేనూ నడుస్తాను. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాం. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది మా నాన్న కల. అది నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తాను. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. అధిష్టానం ఆదేశిస్తే ఏపీలోనే కాదు అండమాన్ లో పని చేయడానికైనా సిద్ధం.' అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి