అరకు: చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దారి తప్పింది. అరకు నియోజకవర్గంలో రా కదలిరా బహిరంగసభకు హాజరయ్యేందుకు చంద్రబాబు విశాఖ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో బయలుదేరారు... అయితే పైలట్ ఏటీసీ సూచనలు అర్థం చేసుకునే విషయంలో కన్ఫ్యూజ్ అవడంతో సమస్య ఏర్పడింది. రాంగ్ రూట్లో వెళ్తున్నట్లుగా గుర్తించిన ఏటీసీ వెంటనే పైలట్ను అప్రమత్తం చేశారు. దీంతో పైలట్ కరెక్ట్ రూట్లో అరుకులో ల్యాండ్ చేయగలిగారు. దీంతో కాసేపు ఉత్కంఠ ఏర్పడింది.
రా కదలిరా సభలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు చంద్రబాబు. అక్కడ నుంచి అరకు వెళ్లేందుకు హెలికాఫ్టర్ రెడీ చేసుకున్నారు. సాధారణంగా వాయుమార్గంలో ప్రయాణించాలంటే సమీపంలోని విమానాశ్రయ ఏటీసీ క్లియరెన్స్ తప్పనిసరి. వారు రూట్ మ్యాప్ ఇస్తారు. ఆ ప్రకారం అరకు వెళ్లేందుకు హెికాఫ్టర్ కు కూడా రూట్ ఖరారు చేశారు. అయితే పైలట్ గందరగోళానికి గురి కావడంతో కాసేపు అందరూ కంగారు పడ్డారు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
అరకు తో పాటు మన్యం మొత్తం నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం కావడం , చంద్రబాబు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేత కావడంతో హెలికాఫ్టర్ దారి ప్పిందని తెలియడంతో అధికారులు కంగారు పడ్డారు. అయితే కాసేపటికే మళ్లీ సరైన దారిలోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ అంశంపై సంబంధిత వర్గాలతో పాటు చంద్రబాబు భద్రతా సిబ్బంది కూడా విచారణ జరిపే అవకాశం ఉంది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి