అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ పక్కనే ఉన్న కొండపాకలూరు గార్డెన్స్లో అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో గురువారం అర్ధరాత్రి ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు మారయ్యబాబు, సూర్యనారాయణ నేతృత్వంలో సీఐలు వీరాంజనేయులు, నయనతార, రమేష్తోపాటు 20 మంది సిబ్బంది తనిఖీలు చేశారు. సచివాలయ ఉద్యోగుల నాయకుడు వెంకట్రామిరెడ్డి ఈ పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించి అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. డిసెంబరు 4న సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎక్సైజ్ శాఖ నుంచి ఎటువంటి అనుమతీ తీసుకోకుండా పార్టీ నిర్వహించి, నిబంధనలను అతిక్రమించినట్లు నిర్వాహకుడు వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి ఏడు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!
షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్లడం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!
ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: