వైఎస్సార్ జిల్లాలోని ఆర్టీపీపీ బూడిద తరలింపుపై నెలకొన్న వివాదానికి తెరదించే ప్రయత్నం జరుగుతోంది. ఈ మేరకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి పురపాలక అధ్యక్షుడు జేసీ ప్రభాకర్రెడ్డి, జమ్మలమడుగు తెదేపా ఇన్ఛార్జి భూపేష్రెడ్డికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గురువారం వర్తమానం అందింది. ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం కలవాలంటూ ఆదేశాలు వచ్చాయి. సిమెంటు పరిశ్రమలకు బూడిద తరలించే విషయంలో జేసీ, ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఇది వరకు జేసీ వర్గీయులే బూడిద తరలించుకుపోతుండగా.. రవాణాలో తమకు వాటా కావాలని ఆదినారాయణరెడ్డి వర్గీయులు పట్టుబట్టారు.
ఇంకా చదవండి: స్కూటీల విభాగంలో హోండా యాక్టివా 7G! పిచ్చెక్కించే ఫీచర్స్ ఏంటంటే! తక్కువ ధరకే మార్కెట్లోకి!
ఈ నేపథ్యంలో బూడిదను వాహనాల్లో నింపకుండా జమ్మలమడుగు ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. ఆదినారాయణరెడ్డి వర్గీయుల బూడిద లారీలు తాడిపత్రి రాకుండా జేసీ ప్రభాకర్రెడ్డి అడ్డగించారు. ఈ వివాదం ముదరడం, ఆర్టీపీపీ వద్ద యుద్ధ వాతావరణం నెలకొనడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడబోమంటూ నేతలను హెచ్చరించారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వద్ద జరిగే సమావేశానికి ముగ్గురు నాయకులకు సమాచారం అందింది.వైఎస్సార్ జిల్లాలోని ఆర్టీపీపీ బూడిద తరలింపుపై నెలకొన్న వివాదానికి తెరదించే ప్రయత్నం జరుగుతోంది. ఈ మేరకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి పురపాలక అధ్యక్షుడు జేసీ ప్రభాకర్రెడ్డి, జమ్మలమడుగు తెదేపా ఇన్ఛార్జి భూపేష్రెడ్డికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గురువారం వర్తమానం అందింది. ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం కలవాలంటూ ఆదేశాలు వచ్చాయి. సిమెంటు పరిశ్రమలకు బూడిద తరలించే విషయంలో జేసీ, ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఇది వరకు జేసీ వర్గీయులే బూడిద తరలించుకుపోతుండగా.. రవాణాలో తమకు వాటా కావాలని ఆదినారాయణరెడ్డి వర్గీయులు పట్టుబట్టారు.ఈ నేపథ్యంలో బూడిదను వాహనాల్లో నింపకుండా జమ్మలమడుగు ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు.
ఇంకా చదవండి: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్! పెన్షన్ లపై కీలక ఆదేశాలు! పూర్తి వివరాలు!
ఆదినారాయణరెడ్డి వర్గీయుల బూడిద లారీలు తాడిపత్రి రాకుండా జేసీ ప్రభాకర్రెడ్డి అడ్డగించారు. ఈ వివాదం ముదరడం, ఆర్టీపీపీ వద్ద యుద్ధ వాతావరణం నెలకొనడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడబోమంటూ నేతలను హెచ్చరించారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వద్ద జరిగే సమావేశానికి ముగ్గురు నాయకులకు సమాచారం అందింది. బూడిద తరలింపు వివాదం నేపథ్యంలో కడప-తాడిపత్రి జాతీయ రహదారిలోని వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం కె. సుగుమంచిపల్లె చెకోపోస్టు వద్ద గురువారం పోలీసులు బందోబస్తు కొనసాగించారు. కొండాపురం, తాళ్లప్రొద్దుటూరు ఠాణాల పరిధిలో 144 సెక్షన్ విధించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!
షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్లడం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!
ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: