వైకాపా హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ, బ్రాండ్ను దెబ్బతీసేలా ప్రవర్తించారని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. శాసనసభ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. "జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తాం. మరొకరు ఇలాంటి తప్పులు చేయకుండా చూస్తాం. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీట్ కూడా మా దగ్గర ఉంది. దీనిపై అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటాం” అని చంద్రబాబు తెలిపారు. జగన్ లాంటి పిరికి వ్యక్తి సీఎం ఎలా అయ్యారు?: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
తన అవినీతి ఖ్యాతిని జగన్ విశ్వవిఖ్యాతం చేసుకున్నారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdary) విమర్శించారు. శాసనసభ సమావేశాల్లో (AP Assembly Session) ఆయన మాట్లాడారు. రూ.60 వేల కోట్లు దోచుకొని జగన్ ఈడీ కేసుల్లో ఉన్నారన్నారు. 12 ఏళ్లుగా కేసును నడుపుకొంటూ వెళ్తున్నారని చెప్పారు. వాటిని ఎలా పొడిగించాలో తెలిసిన వ్యక్తి జగన్ (YS Jagan) అని మండిపడ్డారు. అటువంటి వ్యక్తికి రూ.1,750 కోట్లు లంచం తీసుకోవడం ఓ లెక్కా అని ఎద్దేవా చేశారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలతో భారీగా దోచుకునేందుకు ప్రణాళిక చేశారని ఆరోపించారు. "జగన్ దోపిడీతో రాష్ట్రానికి నష్టం జరిగింది. అదానీతో చాలా ఒప్పందాలు చేసుకున్నారు. ఓ తెలుగు వాడు నిర్వహిస్తున్న గంగవరం పోర్టును అక్రమంగా అదానికి కట్టబెట్టారు. జగన్ అవినీతిని పరాకాష్ఠకు చేర్చారు. ప్రభుత్వ ఖర్చుతోనే తన నివాసానికి ఇనుప బారికేడ్లు పెట్టుకున్నారు. సీఎంగా పర్యటనకు వస్తే చెట్లు కొట్టేయాలా? పరదాలు పెట్టుకోవాలా? దుకాణాలు మూసేయాలా? ఇలాంటి పిరికి వ్యక్తి సీఎం ఎలా అయ్యారు? అమెరికాలో కేసులు వాయిదా వేయించుకునే అవకాశం లేదు. దేశంలో అయితే కేసులు వాయిదా వేయించుకోవచ్చు. జగన్ చేసిన నేరాలు, అక్రమాలపై విచారణ చేయాలని కోరుతున్నాం” అని బుచ్చయ్య చౌదరి అన్నారు.
ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?
జగన్ ను సభకు పిలిపించి అక్రమాలపై విచారణ చేయించాలి: ఆదినారాయణ రెడ్డి
జగన్ 15 ఏళ్ల క్రితమే రూ. లక్ష కోట్లు సంపాదించారని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు ఆయన సంపాదన ఎంతుందో తెలియదన్నారు. ప్రజాధనం దోపిడీ కోసం అంగళ్లు పెట్టాడని ఎద్దేవా చేశారు. జగనన్ను సభకు పిలిపించి అక్రమాలపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? మీకు ఎంత జీతం వస్తుంది?
రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదు! ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే!
శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!
శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!
నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: