వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారంటూ గగ్గోలు పెడుతున్న జగన్ రెడ్డికి.... గతంలో చంద్రబాబు, పవన్కల్యాణ్ సహా ప్రతిపక్ష నాయకులు, కుటుంబ సభ్యులపై ఆయన పార్టీ వాళ్లు పెట్టిన అసభ్యకర పోస్టులు కనిపించడం లేదా? అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy) ధ్వజమెత్తారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
"ఏ తప్పూ చేయని నాపైనా వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. 32 రోజులు జైల్లో ఉంచింది. కనీసం కుటుంబ సభ్యుల్ని కూడా కలవనివ్వలేదు. స్థానికంగా ఉన్న ఆళ్లగడ్డ సబైజైల్లో కాకుండా.. ఎక్కడో ఉన్న ఆదోని జైల్లో ఉంచి కక్ష సాధించారు. మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడే ఏ ఒక్కర్నీ వదలం. 2014-19 మధ్య రహదారుల నిర్మాణానికి తెదేపా ప్రభుత్వం రూ.14,312 కోట్లు కేటాయించి..రూ.11,468 కోట్లు ఖర్చు చేసింది. అప్పట్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి అధికారులు వచ్చి మన రహదారులు, భవనాలశాఖ పనితీరును అధ్యయనం చేశారు. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రూ.16,852 కోట్లు కేటాయించగా... రూ.7,394 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. పైగా రూ.2,300 కోట్లు బకాయిలు పెట్టింది” అని వివరించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: