'108' మాటున అరబిందో సంస్థ భారీ అక్రమాలకు పాల్పడిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో ఆధారాలు బయటపెట్టారు. వైకాపా ప్రభుత్వ హయాంలో వైద్యసేవలు అందాల్సిన 18 లక్షల మందికి అంబులెన్స్లు అత్యవసర సేవలు అందించలేకపోయాయని మండిపడ్డారు. మొత్తం 34 లక్షల మంది బాధితులకు గానూ 17.8 లక్షల మందికి గోల్డెన్ అవర్ సమయంలో చేరలేకపోయాయని ఆడిట్ జనరల్ తప్పుబట్టిందన్నారు. 61 శాతం అంబులెన్స్లో సెలైన్ల కొరత, ఫస్ట్ ఎయిడ్ కిట్ల కొరత ఉన్నట్లు కాగ్ నిర్ధరించిదని గుర్తు చేశారు. విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన అరబిందో పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరబిందో సంస్థ 430 అంబులెన్స్లు నడిపినప్పటికీ.. 720 అన్నట్లు చూపించారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో అంబులెన్స్లకు చట్టాలు వర్తించవా? అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకున్న సంస్థపై గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ్యులు చేసిన ఆరోపణలు నిజమేనని మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. ఇప్పటివరకు అరబిందోకు రూ.600 కోట్ల చెల్లింపులు జరిగాయని, మరో రూ.800కోట్ల పైచిలుకు చెల్లింపులు చేయాల్సి ఉందని వెల్లడించారు. అంబులెన్స్ల విషయంలో నిర్లక్ష్యంతోపాటు దోపిడీ జరిగిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఏం చర్యలు తీసుకుంటున్నారో సభకు, ప్రజలకు తెలియాలన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: