Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

Andhra Pradesh: ఏపీలో జిల్లాలు,మండలాల పేర్లు మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా, మండల, గ్రామాల సరిహద్దులు మరియు పేర్ల మార్పుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా స్పందించింది. స్థానిక ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల విజ్ఞప్

Published : 2025-07-22 21:28:00

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా, మండల, గ్రామాల సరిహద్దులు మరియు పేర్ల మార్పుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా స్పందించింది. స్థానిక ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని, దీనిపై లోతుగా అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. 

ఈ ఉపసంఘంలో ఏడు మంది మంత్రులు – అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా నియమించబడ్డారు. ఉపసంఘానికి కన్వీనర్‌గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ మంత్రివర్గ ఉపసంఘం, పరిపాలనా సౌలభ్యంతో పాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా సరిహద్దుల పునర్నిర్వచనానికి సూచనలు చేయాలని ఆదేశించింది. సరిహద్దులు నిర్ణయించే ముందు భౌగోళిక దూరం, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం, జనాభా లెక్కలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. 

ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభిప్రాయాలు, అభ్యంతరాల ఆధారంగా మార్పులు చేర్పులు జరగాలని పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మరియు సీసీఎల్ఎ శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ ఉత్తర్వులకు సంతకం చేశారు.

Spotlight

Read More →