ఏపీకి కేంద్ర బడ్జెట్ ధమాకా... రూ. 40,000 కోట్ల భారీ నిధుల కేటాయింపు! AP IT Policy: సంక్షేమం + సాంకేతికత.. ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్టర్ ప్లాన్! ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు..! అమిత్ షాతో భేటీ కానున్న సీఎం! మందుబాబులకు బ్యాడ్ న్యూస్... రెండ్రోజుల పాటు వైన్ షాపులు బంద్! రేషన్ కార్డుదారులకు శుభవార్త! కిలో రూ.20 మాత్రమే... ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! రేపు చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం.. 8 గంటల పాటు - ప్రతి కుటుంబం నుండి.. అమరావతిలో 'క్వాంటం' విప్లవం.. గ్లోబల్ టెక్ హబ్‌గా ఏపీ.. చరిత్ర సృష్టించిన శంకుస్థాపన! Indiramma houses : ఇందిరమ్మ ఇళ్లపై సీఎం కీలక ప్రకటన.. రెండో విడత ఏప్రిల్ తర్వాతే! రైతులకు తీపి కబురు.. రైతు భరోసాకు లైన్ క్లియర్.. నగదు జమ అప్పుడే! 11 సీట్లు కూడా మిగలవు.. జాగ్రత్త! కులం అనేది పుట్టుకతో వచ్చే విషయం, ఎంపిక చేసుకునేది కాదు.. ఏపీకి కేంద్ర బడ్జెట్ ధమాకా... రూ. 40,000 కోట్ల భారీ నిధుల కేటాయింపు! AP IT Policy: సంక్షేమం + సాంకేతికత.. ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్టర్ ప్లాన్! ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు..! అమిత్ షాతో భేటీ కానున్న సీఎం! మందుబాబులకు బ్యాడ్ న్యూస్... రెండ్రోజుల పాటు వైన్ షాపులు బంద్! రేషన్ కార్డుదారులకు శుభవార్త! కిలో రూ.20 మాత్రమే... ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! రేపు చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం.. 8 గంటల పాటు - ప్రతి కుటుంబం నుండి.. అమరావతిలో 'క్వాంటం' విప్లవం.. గ్లోబల్ టెక్ హబ్‌గా ఏపీ.. చరిత్ర సృష్టించిన శంకుస్థాపన! Indiramma houses : ఇందిరమ్మ ఇళ్లపై సీఎం కీలక ప్రకటన.. రెండో విడత ఏప్రిల్ తర్వాతే! రైతులకు తీపి కబురు.. రైతు భరోసాకు లైన్ క్లియర్.. నగదు జమ అప్పుడే! 11 సీట్లు కూడా మిగలవు.. జాగ్రత్త! కులం అనేది పుట్టుకతో వచ్చే విషయం, ఎంపిక చేసుకునేది కాదు..

ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు..! అమిత్ షాతో భేటీ కానున్న సీఎం!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఇతర కీలక మంత్రులతో భేటీ అయి పోలవరం, అమరావతి నిధులు, బడ్జెట్ కేటాయింపులపై చర్చించనున్నారు.

Published : 2026-02-09 12:30:00

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ సాయంత్రం విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. సాయంత్రం 7.20 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరే ఆయన, రాత్రి 9.35 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఢిల్లీలో 1-జన్‌పథ్ నివాసంలో ఆయన బస చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో విస్తృత స్థాయిలో చర్చలు జరపడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్థిక వనరులు, అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర సహకారం వంటి అంశాలపై స్పష్టత తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు.


రేపు ఉదయం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఇతర కీలక కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్మలా సీతారామన్‌ను కోరనున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, ప్రత్యేక సహాయంపై కూడా చర్చించనున్నారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన బ్యాంకు రుణాల ప్రక్రియ, కేంద్రం నుంచి అందాల్సిన మద్దతు అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు.


పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ బకాయిల విడుదల, పునరావాసం–పరిహారం అంశాలపై కూడా ఈ పర్యటనలో కీలక చర్చ జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయిన చంద్రబాబు, పోలవరం పునరావాస ప్యాకేజీల అమలు, ఇంకా మిగిలిపోయిన నిధుల విడుదలపై స్పష్టమైన హామీ కోరనున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రతిపాదిత కొత్త సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు, సాంకేతిక సహకారం వంటి అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడిగా భావిస్తుండటంతో, ఈ అంశంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.


ఇదిలా ఉండగా, ఈ నెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న నేపథ్యంలో, సాంకేతిక అభివృద్ధి, డిజిటల్ పాలన, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో కేంద్ర సహకారం అవసరమయ్యే అంశాలను కూడా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నారు. బిల్ గేట్స్ పర్యటన విజయవంతానికి అవసరమైన అంశాలపై ముందస్తు చర్చలు జరిపే అవకాశం ఉంది. అన్ని సమావేశాలు పూర్తైన అనంతరం రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి, రాత్రి 8 గంటలకు విజయవాడ చేరుకోనున్నారు.

Spotlight

Read More →