తెలుగుదేశం పాలనలో బీసీల అభివృద్ధి, అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు వేశాం. జగన్ రెడ్డ వచ్చాక నిధులు లాక్కున్నాడు. విధులు లాక్కున్నాడు. అధికారాలు దూరం చేశాడు. పదవుల్లో రెడ్డలను పెట్టి బీసీలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. వందలాది మంది ప్రాణాలు తీశాడు. చేతి వృత్తులు చేసుకునే వారిని ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే.. జగన్ రెడ్డి వారి జీవితాలను రోడ్డున పడేశాడు.
రూ.75 వేల కోట్లు దారి మళ్లించాడు. నామినేటెడ్ పదవులు, పనుల్లో మనకు అవకాశాలు లేకుండా ఒకే వర్గానికి దారాదత్తం చేస్తున్నాడు. చదువులు దూరం చేస్తున్నాడు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు నాశనం చేశాడు. రాజకీయంగా అవకాశాలు తొక్కి పెట్టాడు. బీసీలను జగన్ రెడ్డి కుటుంబ పెద్దల ముందు మోకరిల్లేలా చేస్తున్నాడు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
రాష్ట్రాన్ని ఐదుగురు రెడ్లకు దారాదత్తం చేసి బడుగు బలహీన వర్గాల వారిపై పెత్తనం చెలాయిస్తున్నాడు. ఇలాంటి జగన్ రెడ్డిని పరిగెత్తించేలా బీసీలు పని చేయాలన్నారు. అనంతరం ‘జయహో బీసీ’ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు వివరించారు. వచ్చే 40 రోజుల్లో దాదాపు 962 మండలాల్లో బీసీ కులాలను కలిసి ముందుకు వెళ్లాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలోని ప్రతి బీసీ వ్యక్తినీ కలిసి వారి సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి