USA: వేడుకల్లో విషాదం.. పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి.! Iran-USA: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం... అదే కారణం! Middle East Conflict: ఇది చెడు వార్త.. ఇరాన్ మా షరతులకు అంగీకరించలేదు..జేడీ వెన్స్ కీలక ప్రకటన..! Donald Trump: చాగోస్ దీవుల అప్పగింతకు బ్రిటన్ బ్రేక్.. ట్రంప్ వ్యతిరేకతతో ఒప్పందం నిలిపివేత! Jag Vikram: ఉద్రిక్తతల వీడిన వేళ.. హార్ముజ్ జలసంధిలో రెపరెపలాడిన భారత జెండా! COP 33: భారత్ సంచలన నిర్ణయం... 2028 'కాప్ 33' సదస్సు హోస్టింగ్ నుంచి విరమణ! UAE Updates: యుద్ధ క్షేత్రంలో జయశంకర్... శాంతి దూతగా భారత్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..! Middle East Conflict: లెబనాన్‌తో శాంతి చర్చలకు నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ హిజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని హెచ్చరిక! Middle East War: ట్రిగ్గర్‌పైనే మా వేలు... ఇరాన్‌కు నెతన్యాహు మాస్ వార్నింగ్! USA: వేడుకల్లో విషాదం.. పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి.! Iran-USA: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం... అదే కారణం! Middle East Conflict: ఇది చెడు వార్త.. ఇరాన్ మా షరతులకు అంగీకరించలేదు..జేడీ వెన్స్ కీలక ప్రకటన..! Donald Trump: చాగోస్ దీవుల అప్పగింతకు బ్రిటన్ బ్రేక్.. ట్రంప్ వ్యతిరేకతతో ఒప్పందం నిలిపివేత! Jag Vikram: ఉద్రిక్తతల వీడిన వేళ.. హార్ముజ్ జలసంధిలో రెపరెపలాడిన భారత జెండా! COP 33: భారత్ సంచలన నిర్ణయం... 2028 'కాప్ 33' సదస్సు హోస్టింగ్ నుంచి విరమణ! UAE Updates: యుద్ధ క్షేత్రంలో జయశంకర్... శాంతి దూతగా భారత్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..! Middle East Conflict: లెబనాన్‌తో శాంతి చర్చలకు నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ హిజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని హెచ్చరిక! Middle East War: ట్రిగ్గర్‌పైనే మా వేలు... ఇరాన్‌కు నెతన్యాహు మాస్ వార్నింగ్!

NRIs Meet CM: అమరావతిలో ఎన్నారైలతో సీఎం చంద్రబాబు ఆత్మీయ సంభాషణ.. అభివృద్ధిపై చర్చలు!

NRIs Meet CM: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలతో ఆత్మీయంగా సమావేశమై, వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు.

Published : 2026-04-13 21:01:00

ఈ భేటీలో పాల్గొన్న అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బహరైన్ దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు..

గల్ఫ్ లో యుద్ధ పరిస్థితుల పై సీఎం ఆరా..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలతో ఆత్మీయంగా సమావేశమై, వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవడం తన పాలనలో ముఖ్య భాగమని చెబుతూ సీఎం ఈ సమావేశాన్ని మరింత సార్థకంగా మార్చారు.

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బహరైన్ దేశాలకు చెందిన పలువురు ప్రవాసాంధ్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ సమన్వయం చేశారు. సమావేశానికి వచ్చిన అతిథులను సీఎం హృదయపూర్వకంగా ఆహ్వానించి, వారు నివసిస్తున్న దేశాల్లో పరిస్థితులు, వారి ఉద్యోగాలు, కుటుంబాల గురించి విచారించారు.

ఈ సమావేశంలో జనసేన పార్టీ నుండి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ నార్త్ అమెరికా కు నియమించబడ్డ శ్రీనివాస్ మిరియాల తో పాటు ఆ పార్టీ ఐటి విభాగ ప్రతినిధి లీల కోటేష్ బాబు తోపాటు కెనడ నుండి భరత్ సాయి, ఆస్ట్రేలియా నుండి నరేంద్ర బాబు, శ్రీ హరి, ఈదర తన్మయి, బహరైన్ నుండి ఆరే అనిల్, ఆరే హిమ శ్రావణి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న తెలుగు కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను బహరైన్ నుంచి వచ్చిన ప్రతినిధులు వివరించారు. ముఖ్యంగా యుద్ధ పరిస్థితుల ప్రభావం అక్కడ ఉన్న నివాసితులపై ఎలా ప్రభావం చూపుతుందా అని ముఖ్యమంత్రి లోతుగా అడిగి తెలుసుకున్నారు.

ఇదే సమయంలో రాష్ట్ర అభివృద్ధిపై కూడా చర్చలు సాగాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నారైలు తెలిపారు. ప్రభుత్వం సరైన ప్రోత్సాహకాలు అందిస్తే మరింత మంది పెట్టుబడిదారులు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. అలాగే విదేశీ అవకాశాలను తెలుగు యువత వినియోగించుకునేలా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఎన్నారైల సూచనలను సానుకూలంగా స్వీకరించిన సీఎం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు రావాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారితో బలమైన అనుబంధం నిర్మించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని కోరుతూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.

అలాగే జనసేన పార్టీ తరపున ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి గా ఎన్నికైన శ్రీనివాస్ మిరియాల ను అభినందిస్తూ, కూటమి కార్యకర్తలు అందరూ కలిసి పాటుపడాలని, ఎంతో కస్టపడితే వచ్చిన అమరావతి శాశ్వత స్థానం గురించి ఎన్నారైలకు వివరించారు. ముఖ్యమంత్రిని నేరుగా కలుసుకుని మాట్లాడే అవకాశం దక్కడం తమకు ప్రత్యేక అనుభూతి అని ఎన్నారైలు తెలిపారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం మరియు ప్రవాసాంధ్రుల మధ్య బంధం మరింత బలపడిందనే అభిప్రాయం వ్యక్తమైంది.

Spotlight

Read More →