Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Avika Gor: నా మార్పులు చూసి ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు.. సోషల్ మీడియా రూమర్లపై అవికా గోర్ ఫుల్ క్లారిటీ! Ebola Virus: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్... మహమ్మారి విజృంభణతో కేంద్రం కఠిన చర్యలు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Healthy Juice: పరగడుపున ఓ చిన్న గ్లాస్ తాగండి చాలు.. జుట్టు రాలదు, మొహంపై మచ్చలు పోతాయ్... Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Avika Gor: నా మార్పులు చూసి ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు.. సోషల్ మీడియా రూమర్లపై అవికా గోర్ ఫుల్ క్లారిటీ! Ebola Virus: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్... మహమ్మారి విజృంభణతో కేంద్రం కఠిన చర్యలు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Healthy Juice: పరగడుపున ఓ చిన్న గ్లాస్ తాగండి చాలు.. జుట్టు రాలదు, మొహంపై మచ్చలు పోతాయ్...

PM Modi: అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్‌ కేరాఫ్ అడ్రస్.. బెంగళూరు సభలో ప్రధాని నిప్పులు!

PM Modi: కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో దశాబ్దాల పాటు తనకు మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు.

Published : 2026-05-10 16:36:00
  • రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ ఎంతటి నీచ రాజకీయానికైనా దిగజారుతుందని ఆగ్రహం..
     
  • Politics: డీఎంకేతో పొత్తు వల్ల కాంగ్రెస్ ఎన్నోసార్లు సంక్షోభాల నుంచి బయటపడిందని వ్యాఖ్య..

PM Modi: కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం సమీపంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, తమిళనాడులో దశాబ్దాల కాలంగా మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. కేవలం అధికారంపై ఉన్న దురాశతోనే ఎంతోకాలంగా తోడున్న మిత్రుడిని వదిలేసిందని, ఇది ఆ పార్టీ నైజానికి నిదర్శనమని విమర్శించారు. గతంలో 2014కు ముందు పదేళ్ల పాటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగించడానికి డీఎంకే మద్దతే కారణమని గుర్తు చేసిన ప్రధాని, కష్టకాలంలో ఆ పార్టీని వదిలిపెట్టి కొత్తగా వచ్చిన టీవీకేతో చేతులు కలపడం ద్వారా స్టాలిన్‌ను మోసం చేసిందని దుయ్యబట్టారు. అధికారం కోసం దొరికిన తొలి అవకాశంలోనే మిత్రధర్మాన్ని విస్మరించిన తీరును ఆయన తూర్పారబట్టారు.

రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఎంతటి నీచ రాజకీయాలకైనా దిగజారుతుందని, అందుకే ఒకప్పుడు 400 సీట్లు గెలిచిన ఆ పార్టీ నేడు 100 సీట్లు కూడా సాధించలేక పోతోందని ప్రధాని ఎద్దేవా చేశారు. ఓటమిని అంగీకరించలేని అహంకారం కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలకు ఉందని, ప్రతి చిన్న విషయానికి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగ సంస్థలను నిందించడం వారికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శల వర్షం కురిపిస్తూ, అంతర్గత కలహాల వల్ల రాష్ట్రంలో సుపరిపాలన కుంటుపడిందని మండిపడ్డారు. గత మూడేళ్లుగా పార్టీలోని విభేదాలను పరిష్కరించుకోవడానికే సమయం సరిపోతోందని, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంతకాలం ఉంటారో కూడా చెప్పలేని అయోమయ స్థితిలో ఆ పార్టీ ఉందని వ్యాఖ్యానించారు.

సరైన అజెండా లేకపోవడం వల్లే దేశ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోందని, ప్రజలు సురక్షితమైన పాలన మరియు అభివృద్ధి కోసం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ మరియు అసోం ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్ బెంబేలెత్తుతోందని, రాబోయే ఎన్నికల్లో కర్ణాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఖాయమని ఆయన ఉద్ఘాటించారు. రాజకీయ విలువలను గాలికొదిలేసి మిత్రపక్షాలను వంచించే కాంగ్రెస్ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి తగిన గుణపాఠం చెబుతారని ప్రధాని తన ప్రసంగంలో హెచ్చరించారు.

Spotlight

Read More →