Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Avika Gor: నా మార్పులు చూసి ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు.. సోషల్ మీడియా రూమర్లపై అవికా గోర్ ఫుల్ క్లారిటీ! Ebola Virus: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్... మహమ్మారి విజృంభణతో కేంద్రం కఠిన చర్యలు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Healthy Juice: పరగడుపున ఓ చిన్న గ్లాస్ తాగండి చాలు.. జుట్టు రాలదు, మొహంపై మచ్చలు పోతాయ్... Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Avika Gor: నా మార్పులు చూసి ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు.. సోషల్ మీడియా రూమర్లపై అవికా గోర్ ఫుల్ క్లారిటీ! Ebola Virus: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్... మహమ్మారి విజృంభణతో కేంద్రం కఠిన చర్యలు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Healthy Juice: పరగడుపున ఓ చిన్న గ్లాస్ తాగండి చాలు.. జుట్టు రాలదు, మొహంపై మచ్చలు పోతాయ్...

Chandrababu: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అధికారిక పర్యటన కోసం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారం, కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించేందుకు ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Published : 2026-05-10 12:39:00

సీఎం చంద్రబాబు రేపు అధికారిక పర్యటన కోసం ఢిల్లీ పయనం..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అధికారిక పర్యటన కోసం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారం, కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించేందుకు ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ముఖ్యమంత్రి ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 11:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్ తో చర్చలు జరపనున్నారు.

ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, కేంద్ర నిధుల విడుదల, అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం వంటి విషయాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలవనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

సాయంత్రం 4 గంటలకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రి నిర్వహించే బిజినెస్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. తాజ్ ప్యాలెస్ లో జరిగే ఈ సమావేశంలో పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రతినిధులతో ఆయన చర్చలు జరపనున్నారు.

అలాగే నీతి ఆయోగ్ సభ్యులతో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ఎస్ మహేంద్ర దేవ్ తో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, పెట్టుబడుల అవకాశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సమన్వయం పెంచుతూ, పెట్టుబడులను ఆకర్షించే దిశగా సీఎం చంద్రబాబు పర్యటన కీలకంగా మారనుందని రాజకీయ, ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.

Spotlight

Read More →