Chandrababu: జై శ్రీరామ్.. జై అమరావతి.. ఒంటిమిట్టలో భక్తిపారవశ్యం, రాజధాని బిల్లుపై చంద్రబాబు హర్షం.! Pawan Kalyan: అమరావతికి లోక్‌సభ అభయం.. నేతన్నలకు, రైతన్నలకు వందనం! పవన్ కల్యాణ్ ప్రశంసలు.. NRIలు జాగ్రత్త.. వ్యవసాయ భూములు కొంటున్నారా? ఆస్తి అమ్మకాలపై భారీగా.. ఆ నిబంధనలు అతిక్రమిస్తే 300 శాతం భారీ పెనాల్టీ! Donald Trump: మాట వినకుంటే రాతియుగానికే.. ఇరాన్ నూతన పాలకుడికి ట్రంప్ తీవ్ర హెచ్చరిక.! UPI Services: ఎస్‌బీఐ యూజర్లకు షాక్.. గంటల తరబడి లోడ్ కాని యూపీఐ యాప్‌లు.. యూజర్ల అసహనం! Realme 16 5G: స్లిమ్ బాడీ.. సూపర్ పవర్.. మన్నికలో రాజీ లేని రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్.! ఇండస్ట్రియల్ గ్రేడ్ రక్షణతో మొబైల్‌.. Jagan Plan B: ఇదేందయ్యా ఇది... జగన్ పేరుతో కొత్త రాజధానా? Gulf Workers: దుబాయ్ నుంచి కోమాలో వచ్చాడు.. కానీ ఆ నిబంధన కొంపముంచింది! అదే ఆ కుటుంబానికి శాపమా... Amaravati Bill: లోక్‌సభలో అమరావతి బిల్లుకు గ్రీన్ సిగ్నల్.. ఏపీ అభివృద్ధికి ఇదే రాజమార్గం అన్న ఎంపీ కేశినేని చిన్ని! Whatsapp New Feature: స్పామ్ మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా... వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్! Chandrababu: జై శ్రీరామ్.. జై అమరావతి.. ఒంటిమిట్టలో భక్తిపారవశ్యం, రాజధాని బిల్లుపై చంద్రబాబు హర్షం.! Pawan Kalyan: అమరావతికి లోక్‌సభ అభయం.. నేతన్నలకు, రైతన్నలకు వందనం! పవన్ కల్యాణ్ ప్రశంసలు.. NRIలు జాగ్రత్త.. వ్యవసాయ భూములు కొంటున్నారా? ఆస్తి అమ్మకాలపై భారీగా.. ఆ నిబంధనలు అతిక్రమిస్తే 300 శాతం భారీ పెనాల్టీ! Donald Trump: మాట వినకుంటే రాతియుగానికే.. ఇరాన్ నూతన పాలకుడికి ట్రంప్ తీవ్ర హెచ్చరిక.! UPI Services: ఎస్‌బీఐ యూజర్లకు షాక్.. గంటల తరబడి లోడ్ కాని యూపీఐ యాప్‌లు.. యూజర్ల అసహనం! Realme 16 5G: స్లిమ్ బాడీ.. సూపర్ పవర్.. మన్నికలో రాజీ లేని రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్.! ఇండస్ట్రియల్ గ్రేడ్ రక్షణతో మొబైల్‌.. Jagan Plan B: ఇదేందయ్యా ఇది... జగన్ పేరుతో కొత్త రాజధానా? Gulf Workers: దుబాయ్ నుంచి కోమాలో వచ్చాడు.. కానీ ఆ నిబంధన కొంపముంచింది! అదే ఆ కుటుంబానికి శాపమా... Amaravati Bill: లోక్‌సభలో అమరావతి బిల్లుకు గ్రీన్ సిగ్నల్.. ఏపీ అభివృద్ధికి ఇదే రాజమార్గం అన్న ఎంపీ కేశినేని చిన్ని! Whatsapp New Feature: స్పామ్ మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా... వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్!

Chandrababu: జై శ్రీరామ్.. జై అమరావతి.. ఒంటిమిట్టలో భక్తిపారవశ్యం, రాజధాని బిల్లుపై చంద్రబాబు హర్షం.!

Chandrababu: శ్రీరాముడి ఆశీస్సులతో, ఆయన చూపిన మార్గంలో ధర్మాన్ని అనుసరించి రాష్ట్రంలో ధర్మబద్ధమైన పాలన అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాముడి పేరు వినగానే సుపరిపాలన, రామరాజ్యం గుర్తుకు వస్తాయని, అదే స్ఫూర్తితో తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

Published : 2026-04-01 22:40:00
  • రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు: భార్య భువనేశ్వరితో కలిసి కల్యాణ వేడుకలో పాల్గొన్న సీఎం..
     
  • Politics: "ధర్మబద్ధమైన పాలనే మా నినాదం": రామరాజ్యం స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం అడుగులు..

Chandrababu: కడప జిల్లాలోని చారిత్రాత్మక ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ధర్మపత్ని భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయన భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. వేలాది మంది భక్తుల జయఘోషల మధ్య, పండితుల మంత్రోచ్ఛారణలతో జరిగిన ఈ కల్యాణ వేడుక కనులవిందుగా సాగింది. వేడుక అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు నాయుడు, శ్రీరాముడి ఆశీస్సులతో రాష్ట్రంలో ధర్మబద్ధమైన పాలన అందిస్తామని పునరుద్ఘాటించారు. 'జై శ్రీరామ్' నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, రామరాజ్యం అంటేనే సుపరిపాలనకు నిదర్శనమని, అదే స్ఫూర్తితో తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట ఆలయాన్ని టీటీడీలో విలీనం చేసి, ఏటా బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో, అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. గతంలో దేవేంద్రుడు పాలించిన అమరావతి చరిత్రను గుర్తు చేస్తూ, ఇప్పుడు తాము నిర్మిస్తున్నది ప్రజల రాజధాని అని ఆయన అభివర్ణించారు. శ్రీరాముడి ఆశీస్సులతో అమరావతి నిర్మాణం సజావుగా సాగుతుందని, ధర్మాన్ని అనుసరిస్తూ ప్రతి పేదవాడికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. రామరాజ్యంలో ప్రజలు ఎలాగైతే సంతోషంగా ఉన్నారో, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే స్థాయి సుపరిపాలనను అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

Spotlight

Read More →