Redmi Note 15 SE 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమీ తన సబ్బ్రాండ్ రెడ్మీ ద్వారా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్ను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రెడ్మీ నోట్ 15 5Gకి స్పెషల్ ఎడిషన్గా Redmi Note 15 SE 5G రేపు లాంచ్ కానుంది. ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా చైనాలో పాపులర్ అయిన 'న్యూ ఇయర్ చెర్రీ రెడ్' కలర్ను ఇక్కడ 'క్రిమ్సన్ రిజర్వ్' పేరుతో విడుదల చేస్తుండటం విశేషం.
సాధారణ మోడల్తో పోలిస్తే ఈ స్పెషల్ ఎడిషన్లో లుక్స్ పరంగా కొన్ని మార్పులు చేశారు. ఈ ఫోన్ మూడు రంగుల్లో లభించనుంది: కార్బన్ బ్లాక్, ఫ్రాస్టెడ్ వైట్ లెదర్ ఫినిషింగ్తో వచ్చే క్రిమ్సన్ రిజర్వ్. ఈ రెడ్ కలర్ వేరియంట్ వెనుక భాగం వేగన్ లెదర్తో వస్తుండటంతో, ఫోన్ పట్టుకోవడానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. డిజైన్ పరంగా ఇది కేవలం 7.35mm మందంతో చాలా స్లిమ్గా ఉండబోతోంది.
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, ఇందులో Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ను వాడారు. కంపెనీ క్లెయిమ్ ప్రకారం, ఈ ఫోన్ వచ్చే నాలుగేళ్ల వరకు ఎలాంటి ల్యాగ్ లేకుండా పనిచేస్తుంది. పాత మోడల్ నోట్ 14 తో పోలిస్తే దీని సీపీయూ (CPU) పనితీరు 30 శాతం మెరుగుపడిందని కంపెనీ చెబుతోంది. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే, ఆండ్రాయిడ్ 16 ఆధారిత సరికొత్త HyperOS 3 ప్లాట్ఫామ్పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
కెమెరా బ్యాటరీ విషయంలో ఈ ఫోన్ అందరినీ ఆకట్టుకోనుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ మాస్టర్ పిక్సెల్ మెయిన్ కెమెరాను ఇచ్చారు, దీని ద్వారా 4K వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో ఏకంగా 5,800mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 44 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది.
ధర విషయానికి వస్తే, కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే గతంలో విడుదలైన నోట్ 15 5G బేస్ వేరియంట్ ధర రూ. 22,999 గా ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ ధర కూడా సుమారు రూ. 23,000 నుండి రూ. 25,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. రేపు జరిగే లాంచ్ ఈవెంట్లో ఖచ్చితమైన ధర ఆఫర్ల వివరాలు బయటకు రానున్నాయి. కొత్త రంగులు పెద్ద బ్యాటరీ కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక మంచి ఆప్షన్ కానుంది.