LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Chandrababu: విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Chandrababu: విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా!

Tirupati: తిరుపతిలో కలకలం రేపుతున్న ఫ్లెక్సీలు.. భూమన కరుణాకర్ రెడ్డిపై ఆరోపణలు!

Tirupati: తిరుపతి నగరంలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని నగరంలోని ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.

Published : 2026-05-17 10:34:00

భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్‍ రెడ్డిపై తిరుపతిలో ఫ్లెక్సీలు..

ఆరు కిలోల గంజాయితో పట్టుబడిన వైసీపీ నేత భాను..

తిరుపతి నగరంలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని నగరంలోని ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల ఆరు కిలోల గంజాయితో పట్టుబడిన వైసీపీ నేత భాను వ్యవహారం నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం మరింత ఆసక్తికరంగా మారింది. భాను, భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డితో కలిసి ఉన్న ఫోటోలను ఫ్లెక్సీల్లో ముద్రించి వివిధ ఆరోపణలు చేశారు.

“ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి వనంగా మార్చవద్దు”, “పుణ్యక్షేత్రం తిరుపతిని గంజాయి నుంచి కాపాడుకుందాం” వంటి నినాదాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తిరుపతి వంటి పవిత్రక్షేత్రంలో గంజాయి మాఫియా పెరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే వైసీపీ పాలనలో భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి కలిసి రూ.50 కోట్ల అక్రమ సంపాదన చేశారంటూ ఫ్లెక్సీల్లో ఆరోపణలు చేశారు. గంజాయి విక్రయాల వెనుక అభినయ్ రెడ్డి పాత్ర ఉందంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు కనిపించాయి.

“తిరుపతిని కాపాడుకుందాం – భూమన కుటుంబాన్ని తరిమికొడదాం” అనే నినాదాలు కూడా ఫ్లెక్సీల్లో ప్రధానంగా కనిపించాయి. దీంతో నగరంలో రాజకీయ చర్చలు మరింత ముదిరాయి.

ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారన్న విషయం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే నగరంలోని రద్దీ కూడళ్లలో ఒక్కసారిగా భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా చర్చించుకున్నారు.

మరోవైపు ఈ వ్యవహారం రాజకీయంగా మరింత దుమారం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో గంజాయి వ్యవహారం మళ్లీ చర్చకు రావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Spotlight

Read More →