Nominated posts: నామినేటెడ్ పదవుల భర్తీ! లక్కీ ఛాన్స్ వారికే!

గత ఎన్నికల ప్రచార సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై గులకరాయి విసిరిన ఘటన మరువకముందే, ఆ కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్ అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. విజయవాడలోని తన ఇంటి నుంచి జులై 18న సతీష్ గల్లంతయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చివరకు జులై 20న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.

PM Kisan: రైతులకు తీపికబురు! పీఎం కిసాన్ / అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే?

పోలీసులు అనేక ప్రాంతాల్లో గాలింపు చేపట్టగా, సతీష్ కడపలో కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే అతను ఎందుకు పారిపోయాడన్న అంశంపై పోలీసుల దర్యాప్తు సాగింది. దీనికి సంబంధించి అతని ఇంట్లో తల్లిదండ్రుల తో జరిగిన మనస్పర్థలే కారణమని గుర్తించారు. ప్రేమ వ్యవహారంపై కుటుంబ సభ్యుల భిన్నాభిప్రాయాలే ఇతడి నడక మార్చినట్లు తేలింది.

Lulu Malls: ఏపీలో ఆ రెండు నగరాల్లో కొత్త లులు మాల్స్.. భూమి కేటాయింపు! ఆ జిల్లాల దశ తిరిగినట్లే!

ఇదిలా ఉండగా, గతంలో ఏప్రిల్ 13, 2024న జగన్ ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఆయనపై రాయి విసిరి గాయపరిచిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ దాడిలో జగన్ కంటికి సమీపంలో గాయం కాగా, పక్కనే ఉన్న అప్పటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి కూడా గాయాలయ్యాయి. ఈ కేసులో సతీష్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచి అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.

Day care cancer center: కేంద్రం గ్రీన్ సిగ్నల్స్... ఏపీలో 14 డే కేర్‌ క్యాన్సర్‌ కేంద్రాలు! ఎక్కడెక్కడంటే?

ఇప్పుడిలా సతీష్ అదృశ్యమై తిరిగి బయటపడటంతో ఈ వ్యవహారంలో ఎలాంటి రాజకీయ కోణముందా? అనే అనుమానాలు కూడా మిగిలిపోయాయి. అయితే ప్రస్తుతానికి కుటుంబసభ్యులకు అప్పగించడం, ప్రేమ వ్యవహారం కారణంగా పారిపోయాడన్న స్పష్టత రావడంతో ఈ కేసు తాత్కాలికంగా ముగిసినట్లు కనిపిస్తోంది.

Dwacra Mahilalu: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కో మహిళకు రూ.2 లక్షల రుణం! నెలకు రూ.30 వేల ఆదాయం
Damaged Currency: ఏపీలో కరెన్సీ 'నోట్ల ఆస్పత్రులు'..! కాలిపోయిన, చిరిగిపోయిన కరెన్సీని మార్చుకోవచ్చు..!
Murder husband: భర్త హత్యకు భార్య ప్లాన్... ఏం జరిగిందంటే?
Serious Warning: కేంద్రం సీరియస్ వార్నింగ్... ఇక నుండి అలా చేస్తే తప్పదు భారీ మూల్యం!
Malaysian company: వచ్చేస్తున్న 'ఎవర్సెండై'..! ఏపీకి మలేషియా బడా కంపెనీ..!
TTd: తిరుమల శ్రీవారి దర్శనానికి... 12 గంటల సమయం!
TCS: 12 వేల మందిపై టీసీఎస్ వేటు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో..!