ఢిల్లీలో జరిగిన భారత్ AI శక్తి (#BharatAIShakti) కార్యక్రమంలో ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ముఖ్య క్షణాన్ని గుర్తుంచుకునేలా సెల్ఫీ తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్ విశాఖపట్నంలోని AI Cityలో 1 గిగావాట్ హైపర్స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ను అధికారికంగా ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం గూగుల్ వచ్చే ఐదు సంవత్సరాల్లో దాదాపు ₹80,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. ఇది భారతదేశం టెక్నాలజీ రంగంలో ఒక గొప్ప మైలురాయిగా మారనుంది.
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన X అకౌంట్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ఆమె ఈ ఘట్టాన్ని భారత్ డిజిటల్ విప్లవానికి కొత్త ఆరంభం”గా పేర్కొన్నారు.
నిర్మలా సీతారామన్ గారు తన పోస్ట్లో ఇలా రాశారు
ప్రధాని నరేంద్ర మోదీ గారి దూరదృష్టి విధానాల వల్ల భారత్ ఇప్పుడు డిజిటల్ శక్తిగా నిలుస్తోంది. భారత్ త్వరలో కృత్రిమ మేధస్సు (AI) మరియు క్వాంటం టెక్నాలజీ రంగాల్లో కూడా ప్రపంచానికి మార్గదర్శకంగా మారబోతోంది.
ఆమె ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ కృషిని కూడా ప్రశంసించారు. వారి నాయకత్వం వల్లే గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ ఇంత పెద్ద పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది అని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో ప్రారంభమైన ఈ భారీ AI సిటీ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ టెక్నాలజీ మ్యాప్లో ప్రముఖ స్థానానికి తీసుకెళ్తుందని అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు టెక్నాలజీ రంగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా భారతదేశం డేటా సెంటర్ల, కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది. అదేవిధంగా, నేటి తరాలకు ఆంధ్రప్రదేశ్ IT హబ్గా స్ఫూర్తిదాయకం కానుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.