భారత ప్రభుత్వం పాకిస్థాన్కు గగనతలపై మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. పాక్ విమానాలకు భారత్ గగనతలాన్ని ఉపయోగించేందుకు ఉన్న నిషేధాన్ని మరోసారి పొడిగించింది. తాజాగా ఈ నిషేధాన్ని ఆగస్టు 23 వరకు విస్తరించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఎక్స్లో (ట్విట్టర్) ప్రకటించారు.
"పాకిస్థాన్ విమానాల భారత గగనతల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఆగస్టు 23 వరకు పొడిగించాం. ఇది ప్రస్తుత భద్రతా పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం" అని ఆయన స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం, పాకిస్థాన్ తీసుకున్న తాజా చర్యలకు బదులుగా తీసినట్లు తెలుస్తోంది. గత వారం పాకిస్థాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ భారతీయ విమానాలపై తమ గగనతల ప్రవేశాన్ని ఆగస్టు 24 వరకు నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం భారత సైనిక, పౌర విమానాలపై వర్తించనుంది.
ఇండియా ఈ నెల 24 వరకు పాకిస్థాన్ విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది. ఇందుకు ప్రస్థానం ఏప్రిల్ 30న ప్రారంభమైంది. అప్పట్లో పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందిన నేపథ్యంలో భారత్ తొలిసారి నిషేధాన్ని అమలు చేసింది. ఆ తర్వాత జూలై 24 వరకు పొడిగించి, ఇప్పుడు మళ్లీ ఆగస్టు 23 వరకు పొడిగించింది.