Tirumala: తిరుమలలో భక్తుల భారీ రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!

Tirumala: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి.

Published : 2026-05-16 09:33:00

ఉచిత దర్శనం కోసం శిలాతోరణం వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు..

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 6 నుండి 8 గంటల సమయం..

తిరుమల: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి. వేసవి సెలవులు, వారాంతం నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

ఉచిత సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు కొనసాగుతోంది. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం వెళ్లే భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) కోసం కూడా భక్తులు భారీగా వేచి ఉండాల్సి వస్తోంది. ఈ దర్శనానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. అలాగే సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 6 నుంచి 8 గంటల నిరీక్షణ కొనసాగుతోంది.

ఇక శ్రీవారిని దర్శించుకునేందుకు రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల సంఖ్య తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచుతోంది. నిన్న ఒక్కరోజే 75,688 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 38,264 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.

అలాగే నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.54 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో అన్ని ఏర్పాట్లు సమర్థంగా కొనసాగుతున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు.

Spotlight

Read More →