Dwacra womens: డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త! ఇక ఇంట్లో కూర్చునే చాలా సింపుల్ గా.. లక్షలు సంపాదించవచ్చు!

దసరా మరియు దీపావళి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ బిలాస్‌పూర్–యల్హంక మధ్య ప్రత్యేక రైలును నడపనుంది. ఈ రైలు సెప్టెంబర్ 9 నుండి నవంబర్ 19 వరకు వారానికి ఒకసారి ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానుంది. బిలాస్‌పూర్‌ నుండి యల్హంక వరకు గుంటకల్లు మార్గంగా నడిచే ఈ ప్రత్యేక రైలు పండుగల సమయంలో ప్రయాణికుల భారం తగ్గించనుందని అధికారులు తెలిపారు.

Dmart Good News: డిమార్ట్ నుండి అతి పెద్ద ఆఫర్.. నెలకి లక్షల రూపాయలు సంపాదించే అవకాశం.! మిస్‌ చేసుకోకండి..

ఈ ప్రత్యేక రైలు (08261) సెప్టెంబర్ 9 నుండి నవంబర్ 18 వరకు ప్రతి మంగళవారం ఉదయం 11 గంటలకు బిలాస్‌పూర్‌ నుండి బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు యల్హంకకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణ రైలు (08262) సెప్టెంబర్ 10 నుండి నవంబర్ 19 వరకు ప్రతి బుధవారం రాత్రి 9 గంటలకు యల్హంక నుండి బయలుదేరి, శుక్రవారం ఉదయం 5.30 గంటలకు బిలాస్‌పూర్‌ చేరుతుంది. ఈ రైలు భటపర, రాయపూర్, సికింద్రాబాద్, లింగంపల్లి, గుంటకల్లు, అనంతపురం, ధర్మవరం వంటి పలు ముఖ్య స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

Ap Cm: కృష్ణమ్మకు జలహారతి.. CM చంద్రబాబు!

అయితే, కర్ణాటకలోని బళ్లారి, తోరణగల్లు స్టేషన్ల వద్ద జరుగుతున్న ఎలక్ట్రికల్‌, సిగ్నలింగ్‌ పనుల కారణంగా గుంటకల్లు మీదుగా నడిచే కొన్ని ప్యాసింజర్‌ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. ఇందులో గుంటకల్లు–చిగ్జాజూర్‌–గుంటకల్లు ప్యాసింజర్‌ (57415/16) రైలు సెప్టెంబర్ 3న పూర్తిగా రద్దు కాగా, మరికొన్ని రైళ్లు పాక్షికంగా మాత్రమే నడుస్తాయని అధికారులు ప్రకటించారు.

Srisailam Dam: రైతులకు, ప్రజలకు శుభవార్త.. విద్యుత్ ఉత్పత్తికి, సాగునీటికి కొత్త ఆశలు..!

తిరుపతి–కదిరిదేవరపల్లి ప్యాసింజర్‌ (57405) సెప్టెంబర్ 2న, దీని తిరుగు ప్రయాణ రైలు సెప్టెంబర్ 3న కేవలం గుంటకల్లు–తిరుపతి మార్గంలో మాత్రమే నడుస్తుంది. అదేవిధంగా, హుబ్లి–గుంటకల్లు (56911/12) ప్యాసింజర్‌ రైళ్లు మునీరాబాద్‌ వరకు మాత్రమే నడిపి, గుంటకల్లు మార్గాన్ని రద్దు చేశారు. హుబ్లి–తిరుపతి (57402) రైలు కూడా సెప్టెంబర్ 3న గంటన్నర ఆలస్యంగా నడపనున్నారు.

వైజాగ్ వేదికగా తెలుగు భాషా దినోత్సవం.. మంత్రుల సమక్షంలో పురస్కారాలు అందుకున్న 14 మంది ప్రముఖులు! వారిలో ఒక్కరు..

అలాగే, వర్షపు నీరు ట్రాక్‌లపై ప్రవహించడంతో నాందేడ్–ధర్మవరం–నాందేడ్ ప్రత్యేక ఫేర్ ఎక్స్‌ప్రెస్‌ ఒక ట్రిప్పు రద్దు చేయబడింది. ఇందులో భాగంగా నాందేడ్–ధర్మవరం (07189) రైలు ఆగస్టు 29న రద్దు కాగా, దీని తిరుగు ప్రయాణం (07190) ఆగస్టు 31న రద్దయిందని అధికారులు స్పష్టం చేశారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లు నడపడం సంతోషకరమే అయినప్పటికీ, కొంతమంది ప్రయాణికులకు ప్యాసింజర్‌ రైళ్లు రద్దు కావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు.

Pawan Kalyan Press Meet: పర్యాటకానికి భంగం.. రుషికొండపై అసంపూర్ణ నిర్మాణాలు! ఆదాయానికి బదులు కరెంటు బిల్లుల భారం.
Anchor Lobo: యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష.. జనగామ కోర్టు తీర్పు!
TG Voter Draft : ఓటరు డ్రాఫ్ట్ జాబితా విడుదల.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
Heavy Rains: భారీ వర్షాలు.. ఆ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది, పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు.
GATE 2026: నోటిఫికేషన్ విడుదల..! కొత్త పేపర్‌తో స్టూడెంట్స్‌కి అదనపు ఆప్షన్‌!
Flight Offers: ఎయిరిండియా అదిరిపోయే ఆఫర్.. రూ. 1299కి టికెట్.. 4 రోజులే ఛాన్స్! పూర్తి వివరాలు..
Russia Indo: రష్యాలో భారతీయ కార్మికులకు భారీ డిమాండ్.. ఇండో-రష్యా బంధాలను!
Hydra: హైదరాబాద్ రోడ్లపై అక్రమ నిర్మాణాలకు చెక్..! హైకోర్టు స్పష్టం!
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఏపీకి కొత్త శకం.! ₹50 వేల కోట్లతో ఆసియాలోనే అతిపెద్దది!