P4 initiative: బంగారు కుటుంబాలు.. పీ-4 కార్యక్రమంతో కొత్త ఆశలు! చంద్రబాబు కీలక ప్రకటన - అలా అస్సలు చేయొద్దు!

గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (GGH) వైద్యులు అసాధారణమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ముఖంపై ఉన్న కణితితో బాధపడుతున్న ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి, దానిని పూర్తిగా తొలగించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.వి. రమణ ఈ వివరాలను మీడియాకు తెలియజేశారు.

Liquor Bottles: రైలులో మద్యం తీసుకెళ్లొచ్చా? రాష్ట్రానుసారంగా నిబంధనలు ఇవే!

ప్రత్తిపాడుకు చెందిన అశోక్ అనే వ్యక్తి చాలా కాలంగా ముఖంపై కణితితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఆయన చికిత్స కోసం జీజీహెచ్‌కు వచ్చారు. వైద్యులు వెంటనే పరీక్షలు నిర్వహించగా, ఆ కణితి 'పారోటిడ్ కార్సినోమా' అని, ఇది భవిష్యత్తులో క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉందని గుర్తించారు. దీనితో ఆలస్యం చేయకుండా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు.

Government Schemes: 30 ఏళ్లు దాటిన వారికి గుడ్ న్యూస్! కేవలం రూ.500 పెడితే చాలు... ఈ మూడు పథకాలతో లక్షలు పొందవచ్చు!

ఉచితంగా విజయవంతమైన శస్త్రచికిత్స…
డాక్టర్ రమణ మాట్లాడుతూ, ఈ శస్త్రచికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారు రూ. 4 లక్షల వరకు ఖర్చవుతుందని, కానీ అశోక్‌కు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద దీనిని ఉచితంగా చేశామని తెలిపారు. ప్రొఫెసర్ కిరణ్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం ఈ క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.

Ukraines First Lady : జైపూర్లో ఉక్రెయిన్ ఫస్ట్ లేడీ.. ఎందుకొచ్చారంటే?

శస్త్రచికిత్స చేసిన వైద్య బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, అశోక్‌కు ధైర్యం చెప్పి శస్త్రచికిత్సకు సిద్ధం చేశామన్నారు. నాలుగు గంటలపాటు శ్రమించి, రోగికి పూర్తిగా మత్తు ఇచ్చి, ముఖ కండరాలకు ఎటువంటి నష్టం కలగకుండా అత్యంత జాగ్రత్తగా సర్జరీ చేశామని వివరించారు. ఈ సర్జరీ విజయవంతం కావడానికి వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది అందరూ సహకరించారని ఆయన ప్రశంసించారు.

Uttarakhand :ఉత్తరాఖండ్లో విలయం.. 50 మందికి పైగా గల్లంతు!
Liquor: ఏపీ సర్కార్ బంపరాఫర్..! గీత కార్మికులకు 10 శాతం బార్ షాపులు!
Tollywood : టాలీవుడ్‌లో వేతనాల వివాదం... మెగాస్టార్ వద్దకు పంచాయితీ!
AP CM: పీ-4 అమలు ప్రక్రియకు శ్రీకారం..! సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం!
HAM Model: ఆ జిల్లాలో రోడ్లకు మహర్దశ! హ్యామ్ విధానంలో అభివృద్ధి!
Lands: ఏపీలోని ఆ 3 జిల్లాల్లో భూసమీకరణ..! ప్రకటన విడుదల..! పరిహారం ఎలాగంటే?