APNRT: ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రుల సంబరాలు.. ఎన్నారైలకు ఏపీఎన్ఆర్టీ ప్రత్యేక పిలుపు.. మీ సంతోషాన్ని పంచుకోండి - రవి వేమూరు

APNRT: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. అయిదు కోట్ల ఆంధ్రుల చిరకాల స్వప్నం, వేలాది మంది రైతుల త్యాగఫలం నెరవేరింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా పార్లమెంటు ఖరారు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ చారిత్రాత్మక విజయంపై ప్రత్యేక కథనం మీకోసం..

Published : 2026-04-02 22:50:00
  • రండి మన రాజధానిని మనమే నిర్మించుకుందాం: రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్కటైన ఐదు కోట్ల ఆంధ్రులు..
     
  • Politics: చరిత్ర సృష్టించిన ప్రజా రాజధాని: అంతర్జాతీయ నగరంగా అమరావతి పునర్నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

APNRT: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ఆత్మగౌరవ ప్రతీక అయిన అమరావతికి ఎట్టకేలకూ అత్యున్నత స్థాయి గుర్తింపు లభించింది. గత కొన్ని ఏళ్లుగా సాగుతున్న అనిశ్చితికి తెరదించుతూ, పార్లమెంటు అమరావతిని ఏకైక మరియు శాశ్వత రాజధానిగా ధృవీకరించింది. ఈ వార్త తెలియగానే రాష్ట్రంలోని పల్లె నుండి పట్నం వరకు, అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ఉన్న తెలుగువారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి విజయం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడి రైతులు. తమ భూములను రాజధాని కోసం త్యాగం చేసి, ఎండనక, వాననక రోడ్ల మీద ఉండి పోరాటం చేసిన తల్లులు, అన్నదాతల కళ్లలో ఈరోజు ఆనందబాష్పాలు రాలుతున్నాయి. "న్యాయం ఆలస్యమవ్వచ్చు కానీ, ఎప్పటికీ ఓడిపోదు" అని ఈ తీర్పు నిరూపించింది. రాజధానిని తరలించాలనే ప్రయత్నాలను అడ్డుకుంటూ సాగిన ఈ ప్రజా పోరాటం భారతదేశ చరిత్రలోనే అరుదైనది.

రాష్ట్ర అభివృద్ధిపై మమకారంతో విదేశాల్లో ఉంటూ కూడా అమరావతి కోసం గళమెత్తిన ప్రవాసాంధ్రుల పాత్ర మరవలేనిది. వారు కేవలం సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో అమరావతి ప్రాముఖ్యతను చాటిచెప్పారు. అమరావతిని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షకు ఎన్నారైలు అండగా నిలిచారు. ఈ విజయం వారి నమ్మకానికి దక్కిన ప్రతిఫలం.

ఈ చారిత్రాత్మక విజయం నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఒక ప్రత్యేక విన్నపం చేశారు. ఈ ఆనంద సమయాన్ని అందరితో పంచుకోవాలని కోరారు.
ఫోటోలు పంపండి: ఎన్నారైలు తాము జరుపుకుంటున్న వేడుకలలోని ఫోటోలలో ఒకే ఒక్క ఫోటోను తీసి 'ఏపీఎన్ఆర్టీ' (ApNRT) సొసైటీకి మరియు మీ సంతోషాన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేస్తూ, అమరావతిపై మీకున్న మమకారాన్ని చాటాలని చీఫ్ మినిస్టర్, అడ్వైజర్ మరియు ఏపీఎన్ఆర్టి ప్రెసిడెంట్ రవి కుమార్ వేమూరు విజ్ఞప్తి చేశారు.

రాజధానిగా ఖరారు కావడంతో ఇక అమరావతిలో పనులు శరవేగంగా పుంజుకోనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారులు, ప్రభుత్వ భవనాలు, ఐటీ కంపెనీలు మరియు విద్యాసంస్థలు ఇక్కడ కొలువుదీరనున్నాయి. ఇది కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రథ చక్రానికి ఇంధనం వంటిది. రాబోయే రోజుల్లో లక్షలాది మంది యువతకు ఇక్కడ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ విజయం ఆంధ్రులలోని ఐక్యతను చాటిచెప్పింది. రాజకీయాలకు అతీతంగా, రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ ఒక్కటిగా నిలిచినప్పుడే ఇలాంటి అద్భుతాలు సాధ్యమని అమరావతి నిరూపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్టుదల, ప్రజల మద్దతు వెరసి అమరావతిని ఒక అజేయమైన శక్తిగా నిలబెట్టాయి.

అమరావతి ఇప్పుడు కేవలం ఒక పేరు కాదు, అది ఒక నమ్మకం. ఐదు కోట్ల ప్రజల ఆశల వారధి. పార్లమెంటు గుర్తింపుతో దీనికి తిరుగులేని చట్టబద్ధత లభించింది. ఇకపై అమరావతి వెలుగులను ఆపడం ఎవరితరం కాదు. ఈ శుభ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ హృదయపూర్వక అభినందనలు. రండి, మన రాజధానిని మనమే నిర్మించుకుందాం!

Spotlight

Read More →