Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..భూముల యాజమాన్య హక్కులను స్పష్టంగా నిర్ధారించడానికి ఆ పథకాన్ని వేగవంతంగా చేసిన కూటమి ప్రభుత్వం!!

పారిశ్రామికాభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ మరో కీలకమైన మైలురాయిని అధిగమించింది. అనకాపల్లి సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ (AM/NS) సంస్థ 8.2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయబోతున్న ఉక్కు కర్మాగారానికి భారత పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (MoEF) ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ (EAC) పర్యావరణ అనుమతికి సిఫారసు చేసింది. రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేయనున్న ఈ స్టీల్ ప్లాంట్ భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఉక్కు తయారీ కర్మాగారంగా రికార్డు సృష్టించనుంది.

TTD: డిగ్రీ చదివినవారికి టీటీడీ బంపరాఫర్..! మరో మహోన్నత కార్యక్రమం..!

ఈ నెల 14-15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ లో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు భూమిపూజ చేయనున్నారు. AM/NS కర్మాగారం వివిధ దశల్లో అభివృద్ధి చేస్తారు. మొదటి దశలో 8.2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతారు. చివరి దశల్లో దీనిని 24 మిలియన్ టన్నుల వరకు విస్తరించనున్నారు. ఈ పరిశ్రమను అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు లోబడి అతితక్కువ వాయుకాలుష్యం ఉండేలా,  అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటుచేయనున్నారు.

Bihar election: బీహార్ వస్తే చంపేస్తాం రేసుగుర్రం విలన్ కు వార్నింగ్ ఇస్తున్న గోరఖ్‌పూర్ నివాసి!!

ఈ కర్మాగారం పూర్తి స్థాయిలో ప్రారంభమైతే, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ లో ప్రధాన పరిశ్రమగా ఉంటుంది. దీనికి అనుబంధంగా ఉక్కు ఆధారిత ఔట్‌పుట్ యూనిట్లు, మిషనరీ తయారీ క్లస్టర్లు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. AM/NS (ఆర్సెలర్ మిట్టల్ - జపాన్ సంస్థ నిప్పాన్ స్టీల్ ల సంయుక్త భాగస్వామ్యం)తో 2024 ఆగస్టులోనే రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చర్చలు జరిపారు. భారతదేశంలో అత్యుత్తమ ఉక్కు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భూమి, విధాన పరమైన మద్దతును AM/NS కోరింది.

Penugonda Renamed: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పెనుగొండకు కొత్త పేరు!

 ప్రభుత్వం మూడే నెలల్లో అవసరమైన భూమిని కేటాయించి, పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకొనేవరకు సింగిల్-విండో మాధ్యమంగా తక్షణమే పూర్తి సహాయ, సహకారాలను అందించింది. ఈ రోజు వచ్చిన MoEF అనుమతి ద్వారా ప్రాజెక్ట్‌కు 14 నెలల్లోనే అన్ని ప్రధాన అనుమతులూ పూర్తయినట్లయింది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడుల ఆకర్షణకు అనుసరిస్తున్న ప్రొయాక్టివ్ విధానానికి అద్దంపడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, పారదర్శక పాలన, మౌలిక వసతులపై ఉన్న ప్రత్యేక దృష్టి కారణంగా, ప్రపంచప్రఖ్యాత కంపెనీల పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారింది.

Dog Breeds Banned: ఈ 6 ప్రమాదకర కుక్కల జాతులపై యజమానులందరికీ కొత్త ఆంక్షలు.. మీ ఇంట్లో ఉంటే జాగ్రత్త సుమీ!!

ఆర్సెలర్ మిట్టల్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో ఆదిత్య మిట్టల్ మాట్లాడుతూ "మేము కోరిన వెంటనే భూమిని కేటాయించి, మాకు అందజేయడం, అవసరమైన అన్ని అనుమతులు శరవేగంతో కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వేగం మమ్నల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. మేము కేవలం ఉక్కు కర్మాగారం కాకుండా పరిశ్రమలో వినూత్నశైలి, సుస్థిరత, కొత్త ఉద్యోగ అవకాశాలకు ముఖ్య కేంద్రంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దాలని భావిస్తున్నాం" అని చెప్పారు. ఏపీ మంత్రి నారా లోకేష్ (ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్ఆర్‌డీ, ఆర్టీజీఎస్) మాట్లాడుతూ “అతితక్కువ సమయంలో ఈ ప్రాజెక్ట్ కు అనుమతులు మంజూరు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వేగం, పారదర్శకత, సమర్థత పరిపాలన ప్రతిబింబిస్తున్నాయి. 

Jio Hotstar: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్! రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పారిశ్రామిక సహాయక వ్యవస్థను అభివృద్ధి చేశాం. AM/NS ప్లాంట్ తీరప్రాంత ఉక్కు పరిశ్రమల్లో కీలక హబ్‌గా మారుస్తుంది. లక్షల ఉద్యోగ అవకాశాలు, స్థానిక ఉత్పాదకత, ఎగుమతులు, నైపుణ్య అభివృద్ధి విభాగాలు పెరుగుతాయి,” అని పేర్కొన్నారు. ఈ నెల 14–15 నవంబర్ 2025న విశాఖపట్నంలో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా పరిశ్రమకు పునాదిరాయి వేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంస్థల సీఈవోలు, పాలసీ మేకర్లు, పరిశ్రమ ప్రముఖులు పాల్గొంటారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయ మౌలిక వసతుల అభివృద్ధికి బలం చేకూరుతుంది. విజయనగరం-అనకాపల్లి- కాకినాడ పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెంది, భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో సుస్థిర ఉక్కు తయారీదారుగా నిలపడంలో కీలకంగా నిలుస్తుంది.
 

Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..!
ప్రబోధిని ఏకాదశి.. ఈరోజు ఇలా చేస్తే కోటి రెట్ల పుణ్యం!
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు! ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!
Tyre Safety: కారు టైర్లలో దాగి ఉన్న స్పీడ్ సీక్రెట్..! తెలియకపోతే భారీ నష్టం..!
Brain Stroke: పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం! ఎవరికి ఎక్కువగా వస్తుందో తెలుసా!