అమరావతి:- ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ నుండి టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. భారీ సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు. శనివారం చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, సర్పంచులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ చంద్రబాబు పసుపు కండువా కప్పి ఆహ్వానించారు.
ఇంకా చదవండి: విజయవాడ: టీడీపీ నేత బోండా ఉమ మీడియా సమావేశం!! మా నేతల ఫోన్లను ట్యాప్..
మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పాల్తేటి పెంటారావు, మాలమహానాడు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు నెక్కలి నాగమణి, బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన దివంగత మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి సోదరుడు చల్లా భాస్కర్ రెడ్డి, కె.రామిరెడ్డి, పులివెందుల నియోజకవర్గానికి చెందిన చక్రాయపేట మాజీ జెడ్పీటీసీ రాధాకృష్ణయ్య, వేంపల్లికి చెందిన జయరామరెడ్డి, పొద్దుటూరు 19వ వార్డు కౌన్సిలర్ షేక్.మునీర్, మాజీ కౌన్సిలర్ గంజికుంట ఆంజనేయులు, మాజీ జెడ్పీటీసీ రామనాథుల భాస్కర్, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎంపీటీసీ కుర్రి శ్రీనివాసు, 10 వార్డు సభ్యులు కుర్రి నాగబాబు, జీడీ నెల్లూరు నియోజకవర్గం నుండి సర్పంచ్ ఏ.గోవిందస్వామితో పాటు ఆయా నియోజకవర్గాల నుండి పెద్దఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ గూటికి చేరారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!
వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!
ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!
ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!
తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: